Pratap Simha: పార్లమెంటులో చొరబాటుదారులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ ఎవరు?

పార్లమెంట్‌లోకి చొరబడిన నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌లో బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహ పేరు రాసి ఉంది. ఇప్పుడు బీజేపీ ఎంపీలే అందరి టార్గెట్ కావడానికి కారణం ఇదే. అయితే ఈ ఘటనపై ప్రతాప్ సింహా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. చొరబాటు నిందితుల్లో ఒకరి తండ్రి తన పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందినవారని, ఆయన విజిటర్స్ పాస్ కోసం అడిగారని ఆయన లోక్‌సభ స్పీకర్‌కు వివరణ ఇచ్చుకున్నారు.

Pratap Simha: పార్లమెంటులో చొరబాటుదారులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ ఎవరు?
Bjp Mp Pratap Simha
Follow us

|

Updated on: Dec 14, 2023 | 12:07 PM

లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన సాగర్, మనోరంజన్ డి. పార్లమెంటు భద్రతలో జరిగిన ఈ భారీ లోపం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ ఇద్దరు నిందితులు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి పాస్ పొందారు. ఎంపీ ద్వారా ఒక వ్యక్తికి పాస్ ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి వ్యక్తిగతంగా తమకు తెలుసని అఫిడవిట్ ఇవ్వాలి.

పార్లమెంట్‌లోకి చొరబడిన నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌లో బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహ పేరు రాసి ఉంది. ఇప్పుడు బీజేపీ ఎంపీలే అందరి టార్గెట్ కావడానికి కారణం ఇదే. అయితే ఈ ఘటనపై ప్రతాప్ సింహా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. చొరబాటు నిందితుల్లో ఒకరి తండ్రి తన పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందినవారని, ఆయన విజిటర్స్ పాస్ కోసం అడిగారని ఆయన లోక్‌సభ స్పీకర్‌కు వివరణ ఇచ్చుకున్నారు.

చొరబాటుదారుల గురించి తన వద్ద పెద్దగా సమాచారం లేదని ప్రతాప్ సింహా లోక్‌సభ స్పీకర్‌కు తెలిపారు. కానీ వారిలో ఒకరైన మనోరంజన్ డి, అతని స్నేహితుడు సాగర్‌కు విజిటర్ పాస్‌లను పొందడానికి సింహ PA నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అటువంటి పరిస్థితిలో, ప్రతాప్ సింహ ఎవరు, అతను ఎక్కడ నుండి వచ్చాడో తెలుసుకుందాం.

ప్రతాప్ సింహా ఎవరు?

ప్రతాప్ సింహా (47) మైసూరు-కొడగు స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అతను మైసూరు నుండి బీజేపీ తరఫున 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ గెలిచారు. ప్రతాప్ సింహా మొదట కన్నడ ప్రభలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. 2015లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా ప్రతాప్ సింహా నియమితులయ్యారు.

ప్రతాప్ సింహా హిందుత్వకు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. కర్నాటకలో టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలను నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఎందుకంటే టిప్పు సుల్తాన్ ఇస్లామిస్టులకు మాత్రమే రోల్ మోడల్ అని అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రతాప్ సింహా కూడా జంతు ప్రేమికుల మీద విరుచుకుపడ్డాడు. కుక్కలను ప్రేమించే వారు తమ పిల్లలను కరిచినప్పుడు వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదమేమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలు తమ ఫైర్ బ్రాండ్ ప్రకటనల వల్ల ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. మసీదులా కనిపించే ప్రతి బస్టాండ్‌ను కూల్చేస్తానని ఒకసారి వివాదాస్పద ప్రకటన ఇచ్చారు ప్రతాప్. బస్టాండ్‌ను గోపురంలాగా తీర్చిదిద్దినందున ఆయన ఈ ప్రకటన చేశారు. ఇంజనీర్లు ఈ రకమైన షెల్టర్‌ను తొలగించాలి. లేకుంటే జేసీబీ తీసుకొచ్చి కూల్చేస్తాను అంటూ గతంలో గట్టిగానే హిందుత్వ భావాన్ని వినిపించారు. అలాంటి వ్యక్తి, పార్లమెంటులో అలజడి స‌ృష్టించిన వ్యక్తులకు పాసులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…