AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: రష్యాకు చైనా బహిరంగ మద్దతు.. ఇద్దరి సాన్నిహిత్యం భారత్‌కు లాభమా? నష్టమా?

ఐక్యరాజ్యసమితిలో భారతదేశం కాకుండా, రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి గైర్హాజరైన మూడు దేశాలలో చైనా కూడా ఒకటి. మూడవ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

Russia Ukraine War: రష్యాకు చైనా బహిరంగ మద్దతు.. ఇద్దరి సాన్నిహిత్యం భారత్‌కు లాభమా? నష్టమా?
India Russia China
Balaraju Goud
|

Updated on: Feb 27, 2022 | 11:56 AM

Share

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి, ముడి చమురు ధరలు(Crude Oils) పెరుగుతున్నాయి. గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా రష్యాపై భారత్(India) ఇంతవరకు స్పందించలేదు. సంయమనం పాటించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది భారత ప్రభుత్వం. భారతదేశం ఈ వైఖరి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. యుద్ధం తర్వాత రష్యా మరోసారి సూపర్ పవర్‌గా ఆవిర్భవించినప్పటికీ, భారతదేశానికి పాత నమ్మకమైన స్నేహితుడు. కానీ భారతదేశం ఆందోళన రష్యా – చైనా మధ్య మైత్రి గురించి.

ఉక్రెయిన్ వివాద సమయంలో చైనా పూర్తిగా రష్యా పక్షాన నిలబడినట్లయింది. గత రెండేళ్లుగా తూర్పు లడఖ్‌కు ఆనుకుని ఉన్న ఎల్‌ఏసీలో సరిహద్దు వివాదంతో భారత్‌ను చైనా ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ సమయంలో భారతదేశం గైర్హాజరైంది. కానీ భారతదేశం ఇప్పటికీ రష్యాకు గానీ అమెరికా సహా NATO మద్దతు ఉన్న ఉక్రెయిన్‌కు అనుకూలంగా లేదు. భారతదేశం యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దౌత్య స్థాయిలో చర్చల ద్వారా మొత్తం వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మాత్రం అనుకూలంగా ఉంది.

ఐక్యరాజ్యసమితిలో భారతదేశం కాకుండా, రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి గైర్హాజరైన మూడు దేశాలలో చైనా కూడా ఒకటి. మూడవ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE). కానీ చైనా రష్యాకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నందున భారతదేశానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. అమెరికాను తమ శత్రువు నెంబర్ వన్ గా ఇరు దేశాలు భావించడం వల్ల చైనా, రష్యాల సాన్నిహిత్యం కూడా పెరుగుతోంది. అయితే ఈ స్నేహం, శత్రుత్వం గేమ్‌లో, భారతదేశం ఎక్కడా నలిగిపోతుందోనన్న ఆందోళ వ్యక్తమవుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన రోజున పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మాస్కోలో ఉన్నందున ఈ ఇబ్బందులు కూడా పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నియంత్రణ రేఖపై శాంతి కోసం భారత్ గత ఏడాది పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని ఉండవచ్చు, కానీ పాకిస్తాన్ ఎప్పుడూ తన స్వభావాన్ని వదులుకోలేదు. సియాచిన్‌పై పోరాటమైనా లేదా కార్గిల్ యుద్ధమైనా లేదా ఉగ్రవాదుల ద్వారా జరిగిన ప్రాక్సీ వార్ అయినా ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడలేదు. అందువల్ల, వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులపై భారతదేశం కూడా నిశితంగా గమనిస్తోంది. రష్యా చైనా పాకిస్థాన్ కూటమి.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఉద్భవిస్తున్న ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ గురించి గురువారం విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా విలేకరుల సమావేశంలో సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తుతున్న ప్రపంచ ఉద్రిక్తతపై భారత విదేశాంగ కార్యదర్శి కూడా సీరియస్‌గా ఉన్నారు. ఆయన స్పందిస్తూ, “దేశాల మధ్య రాజకీయ సమీకరణ పరిస్థితులు మారాయి. ప్రపంచ ఉద్రిక్తతలు పెరిగాయి. కానీ మన దేశ ప్రయోజనాల కోసం మేము ఏది అవసరమో అది చేస్తాము. అది మన పౌరుల భద్రతకు అవసరం.” అని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే, క్యూబా క్షిపణి వివాదంలో రష్యా, అమెరికా ఇరుక్కుపోయి భారత్‌పై చైనా దాడి చేసి అక్సాయ్ చిన్‌ను లాక్కున్న 60ల నాటి పరిస్థితి భారత్‌కు ఇది. నేటికీ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఎందుకంటే చైనా PLA సైన్యం గత రెండేళ్లుగా తూర్పు లడఖ్‌కు ఆనుకుని ఉన్న LACలో మరోసారి క్యాంపింగ్ చేస్తోంది. తూర్పు లడఖ్‌కు అవతలి వైపున ఉన్న చైనా సరిహద్దులో 50 వేల మందికి పైగా చైనా సైనికులతో సహా పెద్ద సంఖ్యలో ట్యాంకులు, ఫిరంగులు, క్షిపణులు, యుద్ధ విమానాలు ఉన్నాయని నమ్ముతారు. భారతదేశం కూడా చైనాతో సమానంగా 50 వేల మంది సైనికులు, ఆయుధాలు, ఇతర సైనిక పరికరాలను మోహరించడానికి కారణం ఇదే.

భారత్‌ ఈ వైఖరికి కారణం ఇదేనా? ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలో, భారతదేశం ఏ పక్షం వహించకపోవడానికి ప్రధాన కారణం రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండటమే. నిజానికి, ఉక్రెయిన్ పాకిస్తాన్ మధ్య కూడా రక్షణ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఉక్రెయిన్ పాకిస్తాన్‌కు T 80D ట్యాంకులను సరఫరా చేసింది. దీనికి ప్రతిస్పందనగా రష్యా నుండి T 90 ట్యాంకులను పొందడానికి భారతదేశం వేగంగా పావులు కదపవల్సి వచ్చింది. 2020లో పాకిస్తాన్ II 78 ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రిపేర్ చేసే కాంట్రాక్టును కూడా ఉక్రెయిన్ పొందింది. గత దశాబ్ద కాలంగా ఉక్రెయిన్‌లో పాకిస్థాన్ రాయబారిగా మాజీ ఆర్మీ అధికారిని నియమించారు. పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ల మధ్య స్నేహం ధృఢమైందనే చెప్పవచ్చు.

2018లో రష్యా నుంచి 300 టీ 90 ట్యాంకులను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ భావించింది. కానీ అది నిరాకరించింది. ఆ తర్వాత 2019లో ఈ ట్యాంకుల కొనుగోలుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్కో నుంచి పాకిస్థాన్ ఆయుధాలు కొనుగోలు చేయలేక ఉక్రెయిన్ వైపు మళ్లింది. మరోవైపు, చైనా ఉక్రెయిన్ మధ్య ఆర్థిక సంబంధాలు కూడా 2014 నుండి బలపడ్డాయి. అయితే రాజకీయంగా అది రష్యాతో నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఐక్యరాజ్యసమితిలోని అన్ని దేశాల భద్రతా ప్రయోజనాలను ప్రస్తావిస్తూ నాటోకు సంబంధించి భద్రతా హామీల కోసం రష్యా చేసిన డిమాండ్‌కు భారతదేశం ఒక విధంగా అంగీకరించింది. భారత్‌కు రక్షణ హార్డ్‌వేర్‌ను సరఫరా చేయడంలో రష్యాకు ముఖ్యమైన స్థానం ఉంది. మాస్కో బీజింగ్‌లను ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావడానికి భారత్ అటువంటి చర్య తీసుకోకూడదని కోరుతోంది.

ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి సమావేశంలో, చర్చల ద్వారా ఉక్రెయిన్‌పై ఉద్రిక్తతలను తగ్గించాలని భారతదేశం పట్టుబట్టింది. భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్. తిరుమూర్తి మాట్లాడుతూ, “మేము సైనిక ఉద్రిక్తతను భరించలేము. ఉక్రెయిన్ సరిహద్దుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై భారత్ నిఘా ఉంచింది. అన్ని పార్టీలు సంయమనం పాటించాలి. ఉక్రెయిన్ ప్రజల భద్రత గురించి ఆందోళన చెందాలి. రష్యన్ ఫెడరేషన్‌తో ఉక్రెయిన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తిరుమూర్తి అన్నారు. ఈ పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని తెలిపారు. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో 20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు పౌరులు నివసిస్తున్నారని తిరుమూర్తి చెప్పారు. భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇరువైపులా సంయమనం పాటించాలని, దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భారత్ పట్టుబట్టిందని ఆయన అన్నారు.

UN లో ఏది చెప్పినా, రష్యా దానిని స్వాగతించింది. రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబూష్కిన్ భారతదేశం “స్వతంత్ర వైఖరి”ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ వైఖరిని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటనలో తెలిపారు. UN భద్రతా మండలిలో భారతదేశ కార్యకలాపాలు మా ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం యోగ్యతను ప్రతిబింబిస్తాయన్నారు.

Read Also…

Russia Ukraine War Live: రావణకాష్టంగా ఉక్రెయిన్.. ప్రపంచ దేశాల ఆంక్షలపై రష్యా ఎదురుదాడి