AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon India: ఆ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థను టార్గెట్ చేసుకున్న హిందూ సంస్థ..? తెలుసుకుందాం రాండి..

అంతర్జాతీయ సంస్థ, దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ గురించి తెలియనివారు ఉండరు. అయితే ఇప్పుడు ఆ దిగ్గజ కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. అమెరికాకు చెందిన ఓ మిషనరీ..

Amazon India: ఆ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థను టార్గెట్ చేసుకున్న హిందూ సంస్థ..? తెలుసుకుందాం రాండి..
The Organiser Magazine Cove
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 16, 2022 | 9:03 AM

Share

అంతర్జాతీయ సంస్థ, దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ గురించి తెలియనివారు ఉండరు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంలోనో, ఇష్టమైన చిత్రాలను చూడడానికో అమెజాన్ సేవలను అందరూ ఏదో ఒక సందర్భంలోనైనా పొందే ఉంటారు. అయితే ఇప్పుడు ఆ దిగ్గజ కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. అమెరికాకు చెందిన ఓ మిషనరీ సంస్థ నుంచి నిధులు సమకూర్చుకుంటూ భారత దేశంలో మత మార్పిడులకు పాల్పడుతోందని ప్రముఖ హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) తన మాగ్‌జెన్ ద్వారా ఆరోపిపంచింది. ఈ మేరకు తన కవర్ స్టోరీని కూడా ప్రచురించింది ఆ మ్యాగ్‌జెన్. ఈ ఆరోపణలను ఖండించిన అమెజాన్.. మత మార్పిడి సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము లాభాపేక్ష లేకుండా భారత్‌లో పనిచేస్తు్న్నామని తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగజైన్ ‘ది ఆర్గనైజర్’ తన ఇటీవలి ప్రచురణలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మత మార్పిడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ కవర్ స్టోరీని పబ్లిష్ చేసింది.‘‘అమేజింగ్ క్రాస్ కనెక్షన్’’ శీర్షికతో ఉన్న కవర్ స్టోరీలో, ‘అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్(ఏబీఎమ్)’ అనే అమెరికాకు చెందిన సంస్థతో కంపెనీకి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, ఈశాన్య రాష్ట్రాలలో మత మార్పిడి కోసం సహకరిస్తున్నట్లు పేర్కొంది.

దేశంలో ఆల్ ఇండియా మిషన్ (ఏఐఎమ్) పేరుతో ఏబీఎమ్ ఒక ఫ్రంట్ నడుపుతోందని కూడా ది ఆర్గనైజనర్ తన ప్రచురణలో ఆరోపించింది.‘‘ఈశాన్య భారతదేశంలో 25 వేల మందిని క్రైస్తవ మతంలోకి మార్చినట్లు తమ వెబ్‌సైట్‌లో బహిరంగంగా పేర్కొన్న వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇద’’ అని మ్యాగ్‌జెన్ వెల్లడించింది. తనపై ఆర్ఎస్ఎస్ మ్యాగ్‌జెన్ చేసిన ఈ ఆరోపణలను అమెజాన్ ఖండించింది. ‘‘అమెజాన్ ఇండియాకు ఆల్ ఇండియా మిషన్ లేదా దాని అనుబంధ సంస్థలతో ఏ విధమైన సంబంధం లేదు. అమెజాన్ ఇండియా మార్కెట్‌ ప్లేస్‌లో అమెజాన్ స్మైల్ ప్రోగ్రామ్ పనిచేయదు. అది ఎక్కడ పనిచేస్తుందో కూడా మాకు తెలియదు’’ అని అమెజాన్‌లో పనిచేసే ఓ అధికారి తెలిపారు.

నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్‌సిపిసిఆర్) చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ “మేము ఈ విషయాన్ని ముందుగానే గమనించి, సెప్టెంబర్‌లో అమెజాన్‌కు నోటీసులు పంపించాము. కానీ అమెజాన్ స్పందించలేదు. తర్వాత నేను అక్టోబర్‌లో అమెజాన్‌కి సమన్లు​జారీ చేసాను. ఇంకా నవంబర్ 1న కమిషన్ కార్యాలయంలో అమెజాన్ ఇండియాలో పనిచేసే ముగ్గురు అధికారులను కలిశాను”అని చెప్పారు. ‘‘అమెజాన్ ఇండియా, ఆల్ ఇండియా మిషన్ మధ్య ఎటువంటి ఆర్థిక సంబంధం లేదని..అమెజాన్ ఇండియా నుంచి ఆ సంస్థకు డబ్బు వెళ్లదని అమెజాన్ ప్రతినిధులు మాకు చెప్పారు. అమెజాన్ సంస్థ అమెరికా ఆల్ ఇండియా మిషన్‌కు కొంత డబ్బు ఇచ్చిందని అమెజాన్ ఇండియా తెలిపింది. విదేశాల్లో ఉన్నట్లుగా ఉన్న ఆల్ ఇండియా మిషన్‌ చిరునామా మాకు ఇచ్చారు. మేము ఇప్పుడు ఆల్ ఇండియా మిషన్‌ను మరింత దర్యాప్తు చేస్తాము”అని కానూంగో చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగ్‌జైన్ అమెజాన్‌పై ఆరోపణలు చేయడం ఇది మొదటి సారి అయితే కాదు. రిటైల్ మార్కెట్‌ను కంపెనీ కూడా వారు గతంలో ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబరు 2021లో “పాంచజన్య”లో అమెజాన్‌ను ఈస్టిండియా కంపెనీతో పోల్చుతూ ఒక కవర్ స్టోరీని ప్రచురించింది. అందులో అమెజాన్ క్రైస్తవ సంస్థలకు నిధులు సమకూర్చడంలో సహకరిస్తుందని ఆరోపించింది. డిసెంబర్ 2021లో, స్వదేశీ జాగరణ్ మంచ్.. భారతదేశంలో అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలకు మంజూరు చేసిన అన్ని అనుమతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది . ఈ సంస్థలు అందించే డిస్కౌంట్ కారణంగా ఇతర సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోందిని మంచ్ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us