Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకంలో రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం వల్ల పది కోట్ల...

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకంలో రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
Follow us
Subhash Goud

|

Updated on: Feb 25, 2021 | 1:02 AM

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం వల్ల పది కోట్ల మంది రైతులు లబ్దిపొందినట్లు తెలిపింది. అయితే అర్హత కలిగిన రైతులందరినీ ఈ పథకంలో చేర్చాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర సూచించింది. పీఎం-కిసాన్‌ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ వివరాలను వెల్లడించారు.

2019లో పీఎం- కిసాన్‌ పథకం ప్రారంభం:

కాగా, రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పీఎం-కిసాన్‌ పేరుతో పథకం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దీని కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే మూడు దఫాల్లో జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా 10.75 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందగా, ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ థోమర్‌ తెలిపారు. దాదాపు 14.5 కోట్ల మంది రైతులకు పీఎం-కిసాన్‌ ద్వారా ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరింత మంది లబ్దిదారులను చేర్చేందుకు ప్రయత్నాలుచే చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చేలా రాష్ట్రాలకు ఆదేశం:

కాగా, ఈ పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులను చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చాలని కేంద్రం సూచించింది. ఈ పథకం కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిందని, అందుచేత ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకంలో పశ్చిమబెంగాల్‌ చేరనప్పటికీ లబ్దిదారుల సమాచారాన్ని కేంద్రానికి అందించిన అనంతరం వారికి కూడా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ వ్యవసాయ రంగం రాణించిందని కేంద్ర మంత్రి అన్నారు.

వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ విన్నర్! కేసు నమోదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ విన్నర్! కేసు నమోదు!
రాయుడు, సచిన్ మెరుపులు.. ఫైనల్లో ఇండియా మాస్టర్స్ విజయం!
రాయుడు, సచిన్ మెరుపులు.. ఫైనల్లో ఇండియా మాస్టర్స్ విజయం!
వాష్ రూమ్‌కు వెళ్లగా గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి భుసలు కొడు
వాష్ రూమ్‌కు వెళ్లగా గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి భుసలు కొడు
మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..