AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యోగీ ఫార్ములాను ఎంచుకున్న రైల్వే.. ఇక వారందరికి మూడినట్లే..!

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాలలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వెస్ట్ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో దుండగులు.. రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా.. పలు రైళ్లకు కూడా నిప్పుపెట్టారు. ఈ ఘటనల్లో రైల్వే శాఖ పెద్ద ఎత్తున నష్టపోయింది. దాదాపు రూ.80 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించిందని.. రైల్వే బోర్డు […]

యోగీ ఫార్ములాను ఎంచుకున్న రైల్వే.. ఇక వారందరికి మూడినట్లే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 31, 2019 | 5:44 AM

Share

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాలలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వెస్ట్ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో దుండగులు.. రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా.. పలు రైళ్లకు కూడా నిప్పుపెట్టారు. ఈ ఘటనల్లో రైల్వే శాఖ పెద్ద ఎత్తున నష్టపోయింది. దాదాపు రూ.80 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించిందని.. రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు రైల్వే శాఖ కూడా యూపీ సీఎం యోగీ రూట్‌ను ఎంచుకుంది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి..వారి నుంచే ఆ మొత్తం వసూలు చేస్తామని ప్రకటించింది.

ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో యోగీ సర్కార్ కఠిన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తిస్తూ.. వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. అందుకు వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికే 498 మందిని గుర్తించి నోటీసులు అందజేశారు. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తామని సీఎం యోగి ప్రకటించారు. అయితే ఇప్పుడు రైల్వే బోర్డు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోవడం ఆసక్తిగా మారింది.