AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆల్వార్ మూకదాడి కేసు.. పునర్విచారణకు ఆదేశం

ఆల్వార్ మూకదాడి కేసు విచారణ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని రాజస్థాన్‌లోని ఆల్వార్‌ కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఈ కేసు విచారణను పోలీసులు కావాలనే పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం హెహ్లూ ఖాన్‌ కేసును పునర్విచారణకు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో పోలీసులు చేస్తున్న విచారణ కూడా సరిగ్గా ఉందా […]

ఆల్వార్ మూకదాడి కేసు.. పునర్విచారణకు ఆదేశం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 2:34 AM

Share

ఆల్వార్ మూకదాడి కేసు విచారణ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని రాజస్థాన్‌లోని ఆల్వార్‌ కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఈ కేసు విచారణను పోలీసులు కావాలనే పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం హెహ్లూ ఖాన్‌ కేసును పునర్విచారణకు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో పోలీసులు చేస్తున్న విచారణ కూడా సరిగ్గా ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాత్ ఇది వరకే స్పష్టం చేశారు.

గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నాడనే నెపంతో 2017 ఏప్రిల్‌ 1న పెహ్లూ ఖాన్‌ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు చితకబాదారు.తీవ్ర గాయాలతో ఓ ఆస్పత్రిలో చేరిన హెహ్లూ ఖాన్‌ 2017 ఏప్రిల్ 3న చనిపోయాడు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా, వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మైనర్లు జువైనల్‌ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. హరియాణాకు చెందిన పెహ్లూ ఖాన్‌ కొన్ని ఆవులను రాజస్థాన్‌ నుంచి హరియాణాకు తరలిస్తుండగా.. ఈ ఘటన అల్వార్‌ ప్రాంతంలో జరిగింది.