AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రితో చర్చలు విఫలం.. దిగిరాని ప్రైవేట్ ఆస్పత్రులు

ఆరోగ్యశ్రీపై ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాబోయే నెలలో రూ.200 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. ప్రైవేట్ ఆస్పత్రులు వెనక్కి తగ్గడంలేదు. మరోవైపు ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య.. బకాయిల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. అయితే రూ. 600 కోట్లకు మించి బకాయిలు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇక, […]

మంత్రితో చర్చలు విఫలం.. దిగిరాని ప్రైవేట్ ఆస్పత్రులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 1:50 AM

Share

ఆరోగ్యశ్రీపై ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాబోయే నెలలో రూ.200 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. ప్రైవేట్ ఆస్పత్రులు వెనక్కి తగ్గడంలేదు. మరోవైపు ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య.. బకాయిల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. అయితే రూ. 600 కోట్లకు మించి బకాయిలు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇక, బకాయిల పేరుతో అత్యవసర సేవలు నిలిపివేయడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మరోవైపు బకాయిలు చెల్లించే వరకూ సేవల్ని పునరుద్ధరించబోమన్నారు యాజమాన్యాల ప్రతినిధులు. మంత్రి ఈటల రాజేందర్‌తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన వారు బకాయిల విడుదలపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగబోవన్నారు.