AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా 600వ టెస్టు.. భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?

Team India: భారత క్రికెట్ సుదీర్ఘ చరిత్రలో మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు తన 600వ టెస్టు మ్యాచ్‌ను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియాను అత్యధిక సార్లు ఓడించిన మూడు జట్ల ఆసక్తికర గణాంకాలు ఇప్పుడు బయటకొచ్చాయి.

Team India: టీమిండియా 600వ టెస్టు.. భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?
Team India
Rakesh
|

Updated on: Aug 15, 2026 | 4:59 PM

Share

Team India: భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్ ఆడటం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియా ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించింది. 100 కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన ప్రత్యర్థులను పరిశీలిస్తే, మన జట్టును అత్యధిక సార్లు ఓడించిన జట్లలో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌పై ఇంగ్లాండ్ ఆధిపత్యం

టెస్టు క్రికెట్‌లో భారత్‌ను అత్యధిక సార్లు ఓడించిన జట్లలో ఇంగ్లాండ్ ప్రథమ స్థానంలో ఉంది. 1932లో తొలి మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో భారత్ మొత్తం 141 టెస్టులు ఆడింది. వీటిలో భారత జట్టు 53 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. రెండు జట్ల మధ్య ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ గడ్డపై ఆడేటప్పుడు భారత బ్యాటర్లు ఎదుర్కొన్న సవాళ్లు ఈ పరాజయాలకు ప్రధాన కారణంగా నిలిచాయి.

భారత్‌పై కంగారూల దాడి

ఈ జాబితాలో ఆస్ట్రేలియా జట్టు రెండవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పటివరకు 112 టెస్టు మ్యాచ్‌ల్లో తలపడగా, 48 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఐతే ఇటీవలి కాలంలో ఆసీస్ గడ్డపై భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే వరుసగా ఓడించి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఆసీస్ ధాటికి వణికిపోయిన భారత్, ఇప్పుడు వారికి గట్టి పోటీ ఇస్తోంది.

వెస్టిండీస్ పేస్ ధాటికి 30 పరాజయాలు

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ జట్టుతో భారత్ ఇప్పటివరకు 102 టెస్టులు ఆడింది. ఆ జట్టు చేతిలో 30 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 70, 80వ దశకాల్లో వెస్టిండీస్ వద్ద ఉన్న భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడం ఏ జట్టుకైనా సవాలుగా ఉండేది. ఆ కాలంలోనే భారత జట్టు ఎక్కువ పరాజయాలను మూటగట్టుకుంది. కాలక్రమేణా విండీస్ ప్రాభవం తగ్గడంతో భారత్ ఆ జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తూ వచ్చింది.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లతో మాత్రమే భారత్ 100 కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 600 టెస్టుల ప్రయాణంలో ఈ మూడు జట్లు భారత జట్టుకు కఠినమైన సవాళ్లను విసిరినప్పటికీ, నేడు టీమిండియా ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టుగా నిలవడం మన క్రికెట్ ఎదుగుదలకు నిదర్శనం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us