AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani: గాంధీ కుటుంబంలో ధైర్యం ఉంటే వారికి చెప్పండి.. పార్లమెంటులో రాహుల్ పై స్మృతి ఇరానీ పెద్ద ఎదురుదాడి..

Parliament No-Confidence Motion: లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ ధీటుగా సమాధానం ఇచ్చారు. మణిపుర్‌ మన దేశంలో భాగం.. ఎవరూ విడదీయలేరు. జమ్ముకశ్మీర్‌ విభజన సమయంలో గాంధీ కుటుంబీకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈరోజు భారత్‌ను చంపే చర్చ జరుగుతోందంటూ మండిపడ్డారు. న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. హత్య చేశారని అంటే కాంగ్రెస్‌ సభ్యులు బల్లలు చరుస్తున్నారని.. కాంగ్రెస్‌వాళ్లు చంపినందుకు టేబుల్‌ కొట్టలేదని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ అన్నారు.

Smriti Irani: గాంధీ కుటుంబంలో ధైర్యం ఉంటే వారికి చెప్పండి.. పార్లమెంటులో రాహుల్ పై స్మృతి ఇరానీ పెద్ద ఎదురుదాడి..
Smriti Irani, Rahul Gandhi
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 09, 2023 | 2:15 PM

మణిపూర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం లోక్‌సభలో కౌంటర్ ఇచ్చారు. భారత హత్య’ అంటూ పార్లమెంటులో ఒకరు మాట్లాడడం ఇదే తొలిసారి అని, సభలో రాహుల్ గాంధీ తీరును తాను ఖండిస్తున్నానని ఇరానీ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో బీజేపీ భరత్‌ను హత్య చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ హత్య అంటే కాంగ్రెస్‌ సభ్యులు బల్లలు చరుస్తున్నారని మండిపడ్డారు. మణిపుర్‌ మన దేశంలో భాగం.. ఎవరూ విడదీయలేరని స్మృతి ఇరానీ అన్నారు. దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్‌ పార్టీయే అంటూ విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు యూపీఏ హయాంలో చాలా జరిగాయన్నారు. రాజస్థాన్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ చేసి.. ముక్కలుగా నరికేశారని.. ఆర్టికల్‌ 370 రద్దు వల్లనే రాహుల్‌ పాదయాత్ర చేయగలిగారని గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370 మళ్లీ తెస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని.. కశ్మీర్‌ పండితులకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా.. అంటూ స్మృతి ఇరానీ ప్రశ్నించారు. కశ్మీర్‌ మహిళలకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా అంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.

మణిపూర్‌లో హింసాకాండపై బిజెపికి వ్యతిరేకంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఈశాన్య రాష్ట్రంలో తమ రాజకీయాలు భారత్ హత్య చేశారని, అధికార పార్టీ సభ్యులను “ద్రోహులు” అని ఆరోపించారు. మీరు భారతదేశం కాదు.. భారతదేశం యోగ్యతను నమ్ముతుంది. రాజవంశాలను కాదు, ఈ రోజు మీలాంటి వారు బ్రిటిష్ వారికి చెప్పిన వాటిని గుర్తుంచుకోవాలి – క్విట్ ఇండియా. అవినీతి క్విట్ ఇండియా, రాజవంశం క్విట్ ఇండియా. మెరిట్ ఇప్పుడు ఇండియాలో చోటు దక్కించుకుంది…’’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

2019 ఎన్నికల సమయంలో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేతను ఓడించిన స్మృతి ఇరానీ రాహుల్‌ గాంధీ ప్రసంగంపై స్పందిస్తూ.. ‘భారత్‌ హత్యపై రాహుల్‌ గాంధీ మాట్లాడినప్పుడు కాంగ్రెస్‌ నేతలు చప్పట్లు కొట్టడం, డెస్క్‌లు కొట్టడం దేశం మొత్తం చూసింది’ అని అన్నారు.

స్మృతి ఇరానీ కూడా 2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని స్పృశించారు మరియు యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పారు.

మరన్ని జాతీయ వార్తల కోసం