PM Modi: నేడు ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. సదస్సులో 65 దేశాల ప్రతినిధులు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ కూడా చేశారు. ‘ఈ రోజు ఉదయం..

PM Modi: నేడు ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. సదస్సులో 65 దేశాల ప్రతినిధులు..
Pm Narendra Modi To Inaugurate Global Investors Summit
Follow us

|

Updated on: Jan 11, 2023 | 10:15 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను నేడు(జనవరి 11) ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ కూడా చేశారు. ‘ఈ రోజు ఉదయం 11 గంటల 10 నిముషాలకు మధ్యప్రదేశ్ – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తాను. ఈ సమ్మిట్‌లో మధ్యప్రదేశ్‌లో విభిన్న పెట్టుబడి అవకాశాలను ప్రదర్శనలు ఉంటాయి’ అని మోదీ తన ట్వీట్‌లో తెలిపారు. సదస్సు ప్రారంభం సందర్భంగా కార్యక్రమంలో సురినేమ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ సంతోఖి, గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా హాజరవుతారు. పర్యావరణ పరిరక్షణ కోసం ‘మధ్యప్రదేశ్-భవిష్యత్ కోసం సిద్ధమైన రాష్ట్రం’ అనే థీమ్‌తో జరగనున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం కార్బన్ న్యూట్రల్, జీరో వేస్ట్.

కార్యక్రమం కోసం ఇండోర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను నిన్న సమీక్షించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘ రాష్ట్ర విధివిధానాలను ప్రోత్సహించడం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను రూపొందించి ప్రోత్సహించడం, పారిశ్రామిక సంస్థలు-పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, మరిన్ని అవకాశాలను కల్పించడం ఈ శిఖరాగ్ర సదస్సు లక్ష్యమ’ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, రెండు రోజుల పాటు జరిగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 65కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ సదస్సలో.. 9 భాగస్వామ్య దేశాలు, 14 అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తమ దేశాలకు సంబంధించిన విభిన్న అంశాలను ప్రదర్శిస్తాయి.  అంతేకాక భారతదేశంలోని 500 మందికి పైగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వివిధ అంశాలపై 19 సెషన్లలో జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ
చిన్నగా ఉందని చీప్‌గా చూడకండి.. ఐస్ క్యూబ్స్ వేస్తే క్షణాల్లో..!
చిన్నగా ఉందని చీప్‌గా చూడకండి.. ఐస్ క్యూబ్స్ వేస్తే క్షణాల్లో..!