Cabinet Expansion today: రాష్ట్రపతి భవన్ వేదికగా మంత్రులు ప్రమాణ స్వీకారం.. విస్తరణలో 27 మంది కొత్తవారికి ఛాన్స్! చిత్రాలు..
కేంద్ర మంత్రిమండలి విస్తరణకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
Updated on: Jul 07, 2021 | 2:42 PM

కేంద్ర మంత్రిమండలి విస్తరణకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా 27 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం.

కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురికి బెర్త్లు ఖరారైనట్టు క్లారిటీ వచ్చింది. వారిలో ముగ్గురికి ప్రమోషన్ కల్పిస్తూ.. కేబినెట్ హోదా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బెర్త్లు ఖరారైన వారిలో.. విజయ్ షోంకర్, అశ్విని వైష్ణవ్, ఆర్సీపీ సింగ్, పసుపతి పరాస్, కపిల్ పాటిల్, మహారాష్ట్ర మజీ సీఎం నారాయణ రాణె, శాంతనూ ఠాకూర్, ప్రీతమ్ ముండే, సునితా దుగ్గల్, శోభా కరన్, అజయ్ భట్, అనుప్రియా పాటెల్, భూపెంద్ర యాదవ్, పురుషోత్తం రూపాలే, మీనాక్షి లేఖి, వరుణ్ గాంధీ పేర్లు ఉన్నాయి.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి ప్రమోషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పిస్తున్నారు. ఇది కాని పక్షంలో స్వతంత్ర హోదా కలిగిన మంత్రిగా పదోన్నతి దక్కేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే కొత్తగా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. దీని బాధ్యతలను మంత్రి కిషన్రెడ్డికి అప్పగించే అవకాశాలు కనిపిస్తోంది.

ఇప్పటికే మంత్రి పదవులుపై క్లారిటీ వచ్చిన నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నివాసానికి ఎంపీ మినాక్షి లేఖి, పురుషోతం రూపాల, అనురాగ్ ఠాకూర్లు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిగా ఉన్న విద్యాశాఖ మంత్రి పొఖ్రియాల్ను.. మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటెల్కు బెర్త్ ఖరారు అయింది.

మోడీ నివాసానికి రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ మోడీ నివాసానికి వచ్చిన ఆసక్తికరమైన పేర్లలో ఒకటి దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్, చిరాగ్ పాస్వాన్ తాజా వ్యాఖ్యలతో ఆయనలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదుగురు పార్టీ ఎంపిలను సస్పెండ్ చేయడం గురించి తాను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చానని, పార్టీ కోటాలో మామను చేర్చుకుంటే తాను కోర్టుకు వెళ్తానని రామ్ విలాస్ కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మంగళవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో కొత్తగా తీసుకునే మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్కి సమాచారం అందింది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.

ఇప్పటికే బెర్త్లు ఖరారైన వారిలో.. విజయ్ షోంకర్, అశ్విని వైష్ణవ్, ఆర్సీపీ సింగ్, పసుపతి పరాస్, కపిల్ పాటిల్, మహారాష్ట్ర మజీ సీఎం నారాయణ రాణె, శాంతనూ ఠాకూర్, ప్రీతమ్ ముండే, సునితా దుగ్గల్, శోభా కరన్, అజయ్ భట్, అనుప్రియా పాటెల్, భూపెంద్ర యాదవ్, పురుషోత్తం రూపాలే, మీనాక్షి లేఖి, వరుణ్ గాంధీ పేర్లు ఉన్నాయి.




