కుమారుని పూజను టీవీలో చూస్తూ…మోదీ తల్లి భావోద్వేగం
అయోధ్యలో ప్రధాని మోదీ నిర్వహించిన భూమిపూజను ఆయన తల్లి హీరాబెన్ అహ్మమదాబాద్ లోని తమ ఇంట్లో టీవీలో చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తను కూడా అయోధ్యలో ఉన్నట్టే భావిస్తూ ముకుళిత హస్తాలతో..
అయోధ్యలో ప్రధాని మోదీ నిర్వహించిన భూమిపూజను ఆయన తల్లి హీరాబెన్ అహ్మమదాబాద్ లోని తమ ఇంట్లో టీవీలో చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తను కూడా అయోధ్యలో ఉన్నట్టే భావిస్తూ ముకుళిత హస్తాలతో కనిపించారు. అటు-రామాలయ నిర్మాణానికి భూమిపూజను నిర్వహించినందుకు మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చరిత్రాత్మక ఘటనపట్ల ప్రతి భారతీయుడూ హర్షం వ్యక్తం చేస్తున్నాడని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు-రాముడు అంటే ప్రేమ అని, న్యాయం, ధర్మమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అంతా ఈ భూమి పూజను స్వాగతించారు.
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తమ నివాసంలో చేరినవారికి స్వీట్లను పంచిపెట్టారు. భూమిపూజ అద్భుత ఘట్టమని కేంద్ర మంత్రులంతా అభివర్ణించారు.