PM Modi: శుక్రవారం లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి.. ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ..

అస్సాంలో నవంబర్ 24న లచిత్ డే జరుపుకుంటారు. శుక్రవారం జనరల్ లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి సందర్భంగా ఈ ఏడాది జరిగిన ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

PM Modi: శుక్రవారం లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి.. ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న  ప్రధాని మోదీ..
Lachit Borphukan Day
Follow us

|

Updated on: Nov 24, 2022 | 8:31 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు పూర్వపు అహోం రాజ్యానికి చెందిన జనరల్ లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఏడాదిపాటు జరిగే కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. నవంబర్ 25న ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో జరిగే ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని పీఎంవో తెలిపింది. లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి సంవత్సర వేడుకలను ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్సాంలోని జోర్హాట్‌లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. లచిత్ బోర్ఫుకాన్ గతంలో అస్సాంలోని అహోం రాజ్యంలో జనరల్. అతను 1671 సరైఘాట్ యుద్ధంలో అతని నాయకత్వానికి గుర్తింపు పొందాడు, ఇందులో అస్సాంను స్వాధీనం చేసుకునేందుకు ఔరంగజేబ్ నేతృత్వంలోని మొఘల్ సైన్యం చేసిన ప్రయత్నం విఫలమైంది.

బ్రహ్మపుత్ర నది ఒడ్డున మొఘలులు ఓడిపోయారు..

ఈ విజయానికి గుర్తుగా నవంబర్ 24న అస్సాంలో లచిత్ డే జరుపుకుంటారు. సరైఘాట్ యుద్ధం గౌహతిలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున జరిగింది. 1671లో జరిగిన సరైఘాట్ యుద్ధంలో లచిత్ బోర్ఫుఖాన్ అస్సామీ సైనికులకు స్ఫూర్తినిచ్చాడని.. దీని ఫలితంగా మొఘల్‌లు ఘోరమైన, అవమానకరమైన ఓటమిని చవిచూశారని PMO పేర్కొంది. లచిత్ బోర్ఫుఖాన్,  అతని సైన్యం చేసిన ఈ యుద్ధం మన దేశ చరిత్రలో ప్రతిఘటన అత్యంత స్ఫూర్తిదాయకమైన సైనిక విజయాలలో ఒకటి.

పాడని వీరులను సముచిత రీతిలో సత్కరించడం ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నమని PMO తెలిపింది. PMO ప్రకారం, దేశం 2022ని లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి సంవత్సరంగా జరుపుకుంటోంది.

మొఘలులను తరిమికొట్టిన వీరుడు..

లచిత్ మొఘలులను చాలాసార్లు ఓడించాడు, ఎల్లప్పుడూ యుద్ధంలో వారిని ఓడించాడు. లచిత్ గౌహతిని మొఘలుల నుండి విడిపించి, దానిని తిరిగి స్వాధీనం చేసుకుని, మొఘల్‌లను గౌహతి నుండి బయటకు నెట్టాడు.

లచిత్ బోర్ఫుఖాన్ ఎవరంటే..

మొహమ్మద్ ఘోరి కాలం నాటి నుండి ముస్లిం రాజులు అహోం రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసారు. అహోం రాజులు వీరోచిత పోరాట పటిమతో వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. భారతదేశాన్నంతా (మరాఠా రాజ్యాన్ని మినహా )ఆక్రమించిన మొఘలులు కూడా అహోం రాజ్యాన్ని ఆక్రమించడానికి, తమ రాజ్యాన్ని తూర్పువైపు విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అహోం రాజ్యంలోని అంతర్గత కలహాలను ఆసరాగా చేసుకొని గౌహతిని ఆక్రమించారు. అహోం రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించటానికి మొఘలుల సేనలు రాజా రాంసింగ్ నేతృత్వంలో 1671లో బ్రహ్మపుత్ర నది తీరంలో సరాయిఘాట్ లో మోహరించాయి.

వీరిని ఎదుర్కొనడానికి రాజా చక్రధ్వజ సింహ తన సర్వ సైన్యాధిపతిగా వీర లచిత్ బర్ఫుకన్ ను నియమించాడు. లచిత్ గొరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు. అహోం రాజ్య భౌగోళిక, నైసర్గిక విశేషాలు బాగా తెలిసినవాడు. అహోం రాజ్య సంఖ్యాబలం మొఘలుల సేనతో పోలిస్తే చాలా తక్కువైనప్పటికీ నదీ జలాల మీద యుద్ధ తంత్రాన్ని నడిపి మొఘలుల సేనలను ఉచకోతకోసాడు. ఆ విధంగా సరాయిఘాట్ యుద్ధము మొఘలులు ఓడిపోయిన అతి కొద్ది యుద్ధాలలో ఒకటిగా నిలిచిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు