భూటాన్​ పర్యటన అనంతరం స్వదేశం చేరుకున్న మోదీ!

 భూటాన్​లో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత్​లో అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జల విద్యుత్​ రంగంలో సహకారం తదితర అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించారు మోదీ. భారత్​కు బయలుదేరే ముందు భూటాన్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని. ఇదొక గుర్తుండిపోయే పర్యటనగా అభివర్ణించారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య […]

భూటాన్​ పర్యటన అనంతరం స్వదేశం చేరుకున్న మోదీ!
Pm Modi Bhutan Visit
Follow us

|

Updated on: Aug 18, 2019 | 8:26 PM

 భూటాన్​లో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత్​లో అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జల విద్యుత్​ రంగంలో సహకారం తదితర అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించారు మోదీ. భారత్​కు బయలుదేరే ముందు భూటాన్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని. ఇదొక గుర్తుండిపోయే పర్యటనగా అభివర్ణించారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి: