First Hydrogen Train: తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న ఉదయం 11 గంటల సమయంలో హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్తో పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి. ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు ఉంటాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాన్ని అందించనుంది. దీని ప్రారంభ ఛార్జీ, అనేక రైల్వే స్టేషన్లలోని ప్లాట్ఫారమ్ టిక్కెట్ ఛార్జీల కంటే కూడా తక్కువ.
ఈ రైల్లో మొత్తం 10 కోచ్లు ఉంటాయి. జింద్- సోనిపత్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మార్గంలో 11 చోట్ల ఆగుతుంది. రోజుకు సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లనుంది. దీనిని స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ ఓవర్హెడ్ విద్యుత్ తీగలు లేకుండా నడుస్తుంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే డీజిల్ రైళ్లలా కాకుండా.. ఈ హైడ్రోజన్ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ రైలును నడపడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ను జింద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ నుండి సరఫరా చేస్తారు. సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి ఈ ప్రాజెక్ట్లో అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు ఇవే..
విలాసవంతమైన సీట్లు ఉంటాయి. హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్షన్ సిస్టమ్లు, నిరంతర వెంటిలేషన్, ఆటోమేటెడ్ హైడ్రోజన్ షట్-ఆఫ్ మెకానిజమ్లు, లోకోమోటివ్ పైలట్ల కోసం రియల్-టైమ్ హెల్త్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. అత్యంత సౌకర్యవంతంగా ఇందులో ప్రయాణం చేయవచ్చు.
