PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..

ప్రధాని కిసాన్-సమ్మన్ నిధి యోజన (పిఎం-కిసాన్ సమ్మన్ నిధి పథకం) కింద లబ్ధిదారులకు ఇప్పటివరకు 7 విడతలుగా మొత్తం రూ .14 వేలు కేంద్ర ప్రభుత్వం అందించింది...

PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 12, 2021 | 6:22 PM

ప్రధాని కిసాన్-సమ్మన్ నిధి యోజన (పిఎం-కిసాన్ సమ్మన్ నిధి పథకం) కింద లబ్ధిదారులకు ఇప్పటివరకు 7 విడతలుగా మొత్తం రూ .14 వేలు కేంద్ర ప్రభుత్వం అందించింది.  ఎనిమిదవ విడత డబ్బు పంపిణీ  ఏప్రిల్ 10 న జరిగే అవకాశం ఉంది. గత రెండేళ్లలో ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 11.66 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా 1.15 లక్షల కోట్లు జమ చేసింది. ఎనిమిదవ విడత డబ్బు పొందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మీరు సబ్మిట్ చేసిన మీ రికార్డులను ఒకసారి సరిచూసుకోండి.

పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయల డబ్బును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.  మొదటి విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య వస్తుంది.  రెండవ విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 మధ్య రైతుల ఖాతాలకు జమ చేస్తారు. మూడవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు బదిలీ చేస్తారు. సాధారణంగా, డబ్బు బదిలీ చేసే ప్రక్రియ 10 రోజులు పడుతుంది.

11.66 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారు

సబ్మిట్ చేసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే, 11.66 కోట్ల నమోదిత రైతులందరికీ ఎనిమిదవ విడత ప్రయోజనం లభిస్తుంది. ఈ సమయంలో, మీరు మీ రికార్డులను కూడా తనిఖీ చేయడం ముఖ్యం. రికార్డులో ఏదైనా తప్పులు ఉంటే,  మీరు ఈ డబ్బును అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

1.44 కోట్ల మంది రైతులు దరఖాస్తు చేసిన తరువాత కూడా డబ్బు రాలేదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దానికి కారణం ఏంటంటే వారి రికార్డులలో లోపం ఉండటం. కొన్నిసార్లు, స్పెల్లింగ్ తప్పిదాల వల్ల డబ్బు కూడా ఆగిపోతుంది. కాబట్టి మీరు అలాంటి తప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడే సరిచేసుకోండి.

రికార్డ్ సరైనదా కాదా… ఇలా తనిఖీ చేయండి

  1. PM కిసాన్ సమ్మన్ నిధి పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in). వెబ్‌సైట్ లాగిన్ అవ్వాలి. ఇందులో, మీరు ‘ఫార్మర్స్ కార్నర్’ టాబ్‌లో క్లిక్ చేయాలి.
  2. మీరు ఇంతకుముందు దరఖాస్తు చేసి, మీ ఆధార్ సరిగా అప్‌లోడ్ చేయకపోతే లేదా కొన్ని కారణాల వల్ల ఆధార్ నంబర్ తప్పుగా నమోదు చేయబడితే, దాని సమాచారం అందులో కనిపిస్తుంది.
  3. ఫార్మర్స్ కార్నర్‌లో, రైతులు పిఎం కిసాన్ యోజన కింద తమను తాము నమోదు చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు.
  4. ఇందులో ప్రభుత్వం లబ్ధిదారులందరి పూర్తి జాబితాను అప్‌లోడ్ చేసింది. మీ అప్లికేషన్ స్థితి ఏమిటి అన్నది  ఆధార్ నెంబర్ / బ్యాంక్ అకౌంట్ / మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
  5. ఈ పథకం ప్రయోజనం పొందిన రైతుల పేర్లను రాష్ట్ర / జిల్లా వారీగా / తహసీల్ / గ్రామం ప్రకారం కూడా చూడవచ్చు.

కొత్త రైతులు ఈ విధంగా నమోదు చేసుకోవచ్చు

  1. పిఎం కిసాన్ సమ్మన్ నిధిని పొందడానికి అర్హులై ఉండి మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేయకపోతే,  మొదటగా, మీరు ఈ పథకంతో అనుబంధించబడిన అధికారిక సైట్‌కు వెళ్లాలి.
  2. ఇక్కడ మీకు ఫార్మర్ కార్నర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. కొత్త రైతు నమోదు కాలమ్‌లో దానిపై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ ముందు కొత్త విండో తెరుచుకుంటుంది. దీనిలో మీరు ఆధార్ కార్డు వివరాలను ఫిల్ చేయాలి. ఆ తర్వాత కొనసాగించు బటన్‌పై క్లిక్ చేయాలి.
  3. దీని తరువాత, మరొక పేజీ మీ ముందు తెరుచుకుంటుంది. మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే, మీ వివరాలు వస్తాయి. మీరు మొదటిసారి రిజిస్ట్రేషన్ చేస్తుంటే, అప్పుడు ఇచ్చిన వివరాలతో రికార్డు లేదు.  PM-KISAN PORTAL లో నమోదు చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది.  దీనిపై అవును(YES) పై క్లిక్ చేయాలి
  4. దీని తరువాత, ఒక  ఫారం కనిపిస్తుంది. దాన్ని ఫిల్ చేయాలి. అందులో సరైన సమాచారాన్ని నింపిన తరువాత, దాన్ని సేవ్ చేయండి. దీని తరువాత, మీ ముందు క్రొత్త పేజీ తెరవబడుతుంది. దీనిలో మీ భూమి సహా ఇతర వివరాలు అడుగుతారు. వాటిని నింపి సేవ్ చేయండి.
  5. మీరు సేవ్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మీకు రిజిస్ట్రేషన్ నంబర్, రిఫరెన్స్ నంబర్ లభిస్తుంది. వెరిఫికేషన్ అనంతరం మీ ఖతాలకు డబ్బు జమ అవుతుంది.

Also Read: Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. రెండు నెలలకు మైదానంలో అడుగుపెట్టిన టీం ఇండియా ఆల్‌రౌండర్..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??