AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election 2024: పోలింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు.. కారణం ఇదేనని తేల్చి చెప్పేశారు..? అదేంటంటే..

గ్రామంలోని బూత్ నంబర్ 97లో ఉదయం 7 గంటల వరకు కేవలం 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మొత్తం ఓటర్లను పరిశీలిస్తే 944 మంది ఓటర్లు ఉండగా, అందులో 524 మంది పురుషులు, 420 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు బూత్‌కు రాకపోవడంపై పోలింగ్‌ అధికారులతో మాట్లాడగా.. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని చెప్పారు.

Lok Sabha Election 2024: పోలింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు.. కారణం ఇదేనని తేల్చి చెప్పేశారు..? అదేంటంటే..
Bihar Village People Boycot
Jyothi Gadda
|

Updated on: Apr 19, 2024 | 3:07 PM

Share

2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ బీహార్‌లో జరిగింది. బీహార్‌లోని 4 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఓటింగ్ పూర్తైంది. అయితే ఓటింగ్ సందర్భంగా షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నెహుటా గ్రామంలో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను కూడా చెప్పారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఉదయం 7 గంటల నుంచి కేవలం 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ గ్రామం గురించి తెలుసుకొని ఓటు వేయకపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకుందాం.

గ్రామంలోని బూత్ నంబర్ 97లో ఉదయం 7 గంటల వరకు కేవలం 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మొత్తం ఓటర్లను పరిశీలిస్తే 944 మంది ఓటర్లు ఉండగా, అందులో 524 మంది పురుషులు, 420 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు బూత్‌కు రాకపోవడంపై పోలింగ్‌ అధికారులతో మాట్లాడగా.. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

గ్రామస్థుల నుంచి అందిన సమాచారం మేరకు.. నెహుటా గ్రామంలోని పోలింగ్ బూత్‌కు ప్రజలు ఎందుకు ఓటు వేయడానికి రాలేదు? ఇందుకు గల కారణాన్ని గ్రామస్థులు వివరిస్తూ ఎవరికి ఓటు వేయాలని ప్రశ్నించారట. గ్రామాన్ని ఎవరూ అభివృద్ధి చేయడం లేదు. బీజేపీకి ఓటు వేసి విసిగిపోయాం. కాంగ్రెస్ వాళ్ళు మా మాట వినరు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది మా గ్రామం.. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం కానీ నేటికీ ఈ గ్రామానికి కనీస సౌకర్యాలు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలింగ్ బూత్ కూడా చాలా దూరంలో ఉంది. రవాణా సాధనాలు లేవు. గ్రామస్తులకు సొంత వాహనాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్ బూత్‌కు ఎలా చేరుకోవాలి.? నాయకులు ఓట్లు అడిగేసి వెళ్లిపోతారు. వ్యవసాయ భూమికి కౌలు చెల్లించాలి. సాగునీటి కోసం నది కాలువ లేదు. కరెంటు కనెక్షన్ తీసుకుని సాగునీరు చేస్తే దానికి కూడా అద్దె చెల్లించాలి. నేతల వాగ్దానాలతో విసుగెత్తిపోయిన గ్రామస్తులు చివరు ఇలా ఓటింగ్‌ను బహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దావానంలా వ్యాపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..