Pariksha Pe Charcha: పరీక్షాపే చర్చలో విద్యార్థులతో ప్రధాని మోదీ.. వీడియో షేర్
ఈసారి విభిన్నంగా విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమం కోసం మొత్తం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతావారంతా వర్చువల్గా పాల్గొన్నారు. సుందరవనంలో..

బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10, 2025న దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ‘పరీక్ష పే చర్చ’ 8వ ఎడిషన్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో విజయం సాధించడానికి పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి ప్రధాని మోదీ చిట్కాలను కూడా పంచుకున్నారు. ప్రధాని మోదీ పంచుకున్న చిట్కాల గురించి తెలుసుకుందాం.
సహజ వాతావరణంలో సమయం గడపడం ముఖ్యమని, సూర్యోదయం తర్వాత చెట్టు కింద నిలబడి గాఢంగా శ్వాస తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని ప్రధాని మోదీ అన్నారు. జీవితంలో ఏదైనా పురోగతి సాధించాలంటే పోషకాహారం అత్యంత ముఖ్యమైనదని, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ చాలా ముఖ్యమైనని సూచించారు. ఇది కాకుండా ఒక విద్యార్థికి లేదా ఏ వ్యక్తికైనా ఒక సాధారణ దినచర్యను అనుసరించడం ముఖ్యమన్నారు. క్రమం తప్పకుండా దినచర్య పాటించడం వల్ల మనస్సు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఇది పరీక్షకు సిద్ధం కావడానికి సహాయపడుతుందన్నారు.
పిల్లలను ప్రేరేపించడానికి ప్రధాని మోదీతో పాటు, సద్గురు, దీపికా పదుకొనే, మేరీ కోమ్, అవని లేఖరా కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. మానసిక ప్రశాంతతను, ఆందోళనను నియంత్రించుకునే మార్గాలను సద్గురు వివరించారు. దీపిక మానసిక శ్రేయస్సు గురించి మాట్లాడి మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. మేరీ కోమ్, అవ్ని లేఖారా పిల్లలను ప్రేరేపించడానికి వారి దృఢ సంకల్పం. విజయ ప్రయాణాన్ని పంచుకున్నారు.

కాగా, ఈసారి విభిన్నంగా విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమం కోసం మొత్తం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతావారంతా వర్చువల్గా పాల్గొన్నారు. సుందరవనంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు.
పరీక్షలో చర్చ ప్రాముఖ్యత ఏమిటి?
ఈ సంవత్సరం ‘పరీక్ష పే చర్చ’ ఢిల్లీలోని సుందర్ నర్సరీలో నిర్వహించారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడటమే కాకుండా జీవితంలోని వివిధ అంశాలపై వారికి మార్గదర్శకత్వం కూడా అందిస్తుంది. ప్రధానమంత్రి మోదీతో ప్రత్యక్ష సంభాషణ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే వారి ప్రశ్నలకు సమాధానాలు పొందే అవకాశాన్ని ఇస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




