High Alert: హైఅలర్ట్.. ఉగ్ర కుట్రకు భారీ స్కెచ్.. ఫెస్టివల్ సీజన్లో టార్గెట్.. అఫ్గాన్ ఉగ్రవాదుల ప్లాన్..
ఉగ్ర కుట్రకు స్కెచ్ రెడీ అయిందా..? రాబోయే ఫెస్టివల్ సీజన్ టార్గెట్ కాబోతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాబోయే పండుగ రోజుల్లో దేశంలో...
ఉగ్ర కుట్రకు స్కెచ్ రెడీ అయిందా..? రాబోయే ఫెస్టివల్ సీజన్ టార్గెట్ కాబోతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాబోయే పండుగ రోజుల్లో దేశంలో భారీ దాడులకు తెగబడేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి. మన దేశంలోకి చొరబడేందుకు 40 మంది అఫ్గాన్ ఉగ్రవాదులు పన్నాగాలు రచిస్తున్నట్టు తెలిపింది. పాక్ మద్దతుతో దేశంలోకి చొరబడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించింది. పాక్లోని ఐఎస్ఐ అండతో సరిహద్దులు దాటేందుకు అఫ్గాన్ మూకలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. వీరికి టిఫిన్బాంబుల తయారీలో పాక్ శిక్షణ ఇచ్చిందని అప్రమత్తం చేసింది.
జమ్ముకశ్మీర్లోకి చొరబడి దాడులు చేయొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు పారామిలటరీ, రాష్ట్ర పోలీసులను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ముష్కరుల కదలికలపై పక్కా సమాచారం ఉందని వెల్లడించాయి. జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాల్ని సైన్యం భగ్నం చేసింది.
ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. వారి నుంచి ఐదు రైఫిళ్లు, ఏడు తుపాకీలు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు అధికారులు.
ఇవి కూడా చదవండి: Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..
Stock market update: బుల్ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..
రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..