AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ‘ఘాజీ’ అటాక్‌కు సిద్ధమైన పాక్..!

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలిపేందుకు పాక్ అధికారులు నానా ప్రయత్నాలు చేశారు. అయితే అన్ని దేశాలు పాక్‌కు హ్యాండిచ్చాయి. సహాయం కాదు కదా.. కశ్మీర్ అన్నది భారత అంతర్గత సమస్య.. అందులో మేము తలదూర్చమంటూ మొహం మీదే చెప్పేశాయి. దీంతో చేసేదేం లేక ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధం చేసేందుకు మేమెప్పుడూ […]

మరో ‘ఘాజీ’ అటాక్‌కు సిద్ధమైన పాక్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2019 | 12:02 PM

Share

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలిపేందుకు పాక్ అధికారులు నానా ప్రయత్నాలు చేశారు. అయితే అన్ని దేశాలు పాక్‌కు హ్యాండిచ్చాయి. సహాయం కాదు కదా.. కశ్మీర్ అన్నది భారత అంతర్గత సమస్య.. అందులో మేము తలదూర్చమంటూ మొహం మీదే చెప్పేశాయి. దీంతో చేసేదేం లేక ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధం చేసేందుకు మేమెప్పుడూ ముందు ఉండమని నీతులు చెబుతూ.. భారత్‌పై దాడి చేసేందుకు ఒక్కో ప్రణాళికను రచిస్తున్నారు పాక్ అధికారులు.

కాగా పాక్‌కు చెందిన కమాండోలు భారత జలాల్లోకి ప్రవేశించబోతున్నట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో దాడి చేసేందుకు పాక్ అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తోందని.. ఈ క్రమంలో ఘాజీ తరహా అటాక్‌కు వారు సిద్ధంగా ఉన్నారని ఐబీ అధికారులు తెలిపారు. దేశంలో అతిపెద్ద పోర్టుగా పేరొందిన ముంద్రాలోకి(గుజరాత్) పాక్ కమాండోలు ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో ఆ పోర్టులో పాటు దేశవ్యాప్తంగా మిగలిన పోర్టులను అప్రమత్తం చేశారు భారత నేవీ అధికారులు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్  సముద్ర మార్గంలో దాడులు చేసేందుకు సిద్ధమౌతోందని.. ఇందుకోసం ఈ ఉగ్ర ముఠా జలాంతర విభాగం ఏర్పాటు చేసిందని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మొన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సముద్ర మార్గాల నుంచి చొరబాటుదారులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతను పెంచామని.. పాక్ చర్యలను తాము తిప్పికొడతామని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం