AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa: కుప్పకూలిన దూద్‌సాగర్‌ కేబుల్‌ బ్రిడ్జి..! తృటిలో తప్పించుకున్న 40 మంది ప్రయాణికులు..

భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వంతెన కూలిపోవడంతో, 40 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వర్షాకాలం ప్రారంభంలో ఈ జలపాతం సందర్శన నిలిపివేయబడింది.

Goa: కుప్పకూలిన దూద్‌సాగర్‌ కేబుల్‌ బ్రిడ్జి..! తృటిలో తప్పించుకున్న 40 మంది ప్రయాణికులు..
Cable Bridge
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2022 | 12:44 PM

Share

ఎప్పుడూ పర్యాటకుల రద్దీతో ఉండే గోవాలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా దూద్ సాగర్ జలపాతం వద్ద కేబుల్ బ్రిడ్జి తెగిపోయింది. 40మందికిపైగా పర్యాటకులను అధికారులు, అక్కడున్న సిబ్బంది రక్షించారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో మండోవి నదిపై ఉన్న కేబుల్ వంతెన కొట్టుకుపోయింది. గోవా-కర్ణాటక సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వంతెన కూలిపోవడంతో, 40 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిని దృష్టి లైఫ్‌సేవర్స్‌ సహాయం ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వంతెన లేకపోవడంతో సందర్శకులు తమంతట తాముగా ప్రవహించే నీటిలో నదిని దాటలేకపోయారు. ఆ తర్వాత రాష్ట్రం నియమించిన లైఫ్‌గార్డ్‌లు వారిని అక్కడ్నుంచి ఖాళీ చేయించారు.

నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడం వల్ల క్రాసింగ్ కోసం ఉపయోగించిన వంతెన కూలిపోయింది. దాంతో 40 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. దృష్టి లైఫ్‌గార్డుల ద్వారా వెంటనే జలపాతం వద్ద లైఫ్‌సేవర్స్ సహాయం అందించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, నీటిమట్టం పెరగడంతో రానున్న కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్‌ జలపాతం సందర్శనకు పర్యాటకులు, స్థానిక ప్రజలు ఎవరూ వెళ్లకూడదని దృష్టి లైఫ్‌సేవర్స్‌ హెచ్చరించింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసినవారంతా పర్యాటకులను రక్షించినందుకు రివర్ లైఫ్‌సేవర్స్‌కు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గోవా-కర్ణాటక సరిహద్దులో ఉన్న సుందరమైన దూద్‌సాగర్ జలపాతం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. వర్షాకాలం ప్రారంభంలో ఈ జలపాతం సందర్శన నిలిపివేయబడింది. కానీ ఈ వారం ప్రారంభంలో పర్యాటకుల కోసం తెరవబడింది. ఇదిలావుండగా, అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 17 వరకు కర్నాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. కర్నాటక సీఎం బొమ్మై ప్రకారం, అక్టోబరు ప్రారంభం నుండి వర్షాలతో దెబ్బతిన్న కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశువులు, ఆస్తులకు పెద్ద ఎత్తున విధ్వంసం సంభవించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..