Odisha horror: 15 ఏళ్ల బాలికను సజీవదహనం చేసే యత్నం… ఒడిశాలోని పూరీలో దారుణం
ఒడిశాలో అమ్మాయిలపై వరుస అఘాయిత్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాలాసోర్లో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక బీఈడీ విద్యార్ధిని ఆత్మాహుతి ఘటన మరవక ముందే మరో దారుణం వెలుగు లోకి వచ్చింది. అధ్యాత్మిక క్షేత్రం పూరీలో 15 ఏళ్ల బాలికను కొందరు దుండగులు సజీవదహనం చేసేంకు...

ఒడిశాలో అమ్మాయిలపై వరుస అఘాయిత్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాలాసోర్లో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక బీఈడీ విద్యార్ధిని ఆత్మాహుతి ఘటన మరవక ముందే మరో దారుణం వెలుగు లోకి వచ్చింది. అధ్యాత్మిక క్షేత్రం పూరీలో 15 ఏళ్ల బాలికను కొందరు దుండగులు సజీవదహనం చేసేంకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. బాలికను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించాడు ముగ్గురు దుండగులు. బాలికపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశారు. మంటలు అంటుకోవడంతో బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దుండగులు పరారయ్యారు. గాయపడ్డ బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. భువనేశ్వర్ ఎయిమ్స్లో బాలికకు చికిత్స జరుగుతోంది. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
పూరీ జిల్లా బయాబర్ గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ గ్రామానికి చెందిన ఇంటర్ చదివే ఓ బాలిక తన స్నేహితురాలికి బుక్స్ ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న ఆ అమ్మాయిని భార్గవి నది సమీపంలోని నిర్జన ప్రదేశంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకుని.. నిప్పంటించి పారిపోయారు. మంటల్లో కాలుతూ అరుస్తున్న బాలికను స్థానికులు చూసి.. వెంటనే మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. తొలుత పిపిలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒడిశాలోని ఎయిమ్స్కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మహిళా, శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. బాలిక చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె వెల్లడించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.




