AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య, గత కొన్ని గంటల్లో సంఘటనలు వేగంగా మారిపోయాయి. మొదట డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటిస్తారు. ఆ తరువాత రంగంలోకి దిగిన చైనా పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్
Nsa Ajit Doval & China's Foreign Minister Wang Yi
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2025 | 1:08 AM

భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య, గత కొన్ని గంటల్లో సంఘటనలు వేగంగా మారిపోయాయి. మొదట డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటిస్తారు. ఆ తరువాత రంగంలోకి దిగిన చైనా పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమాయకులైన పౌరుల ప్రాణ నష్టం జరిగినందున భారతదేశం ఉగ్రవాద నిరోధక చర్య తీసుకోవలసి వచ్చిందని దోవల్ అన్నారు . ఈ యుద్ధం భారతదేశం ఎంపిక చేసుకోలేదు. ఏ పార్టీ ప్రయోజనాల కోసం కాదు. భారతదేశం-పాకిస్తాన్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటాయన్నారు. దీంతో వీలైనంత త్వరగా ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని ఆశిస్తున్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలిపారు దోవల్.

పహల్గామ్ ఉగ్రవాద దాడిని చైనా ఖండిస్తుందని, అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి అల్లకల్లోలంగా, పరస్పరం అనుసంధానించి ఉంది. ఆసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని సాధించడం కష్టం. దానిని గౌరవించాలి. భారతదేశం-పాకిస్తాన్ వేరు చేయలేని పొరుగు దేశాలు, రెండూ చైనాకు పొరుగు దేశాలు. రెండు దేశాలు సంయమనం పాటించాలని చైనా విదేశాంగ మంత్రి అన్నారు.

యుద్ధం భారతదేశం ఎంపిక కాదని చేసిన ప్రకటనను చైనా అభినందిస్తున్నదని, భారత్-పాక్ ప్రశాంతత, సంయమనం పాటిస్తాయని, చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను సరిగ్గా పరిష్కరించుకుంటాయనిపరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధిస్తుందని ఆయన ఆశిస్తున్నారని అన్నారు. భారతదేశం – పాకిస్తాన్ మధ్య సంప్రదింపుల ద్వారా సమగ్రమైన, శాశ్వతమైన కాల్పుల విరమణను సాధించాలని చైనా మద్దతు ఇస్తుందన్నారు. ఇది రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు సంబంధించినది. అంతర్జాతీయ సమాజం కోరిక కూడా ఇదే అని చైనా విదేశాంగ మంత్రి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..