Lockdown: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా ఆలోచన.. షాపుల వద్ద బారులు తీరుతున్న జనాలు

Lockdown: దేశ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినా.. పలు రాష్ట్రాల్లో మాత్రం మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ..

Lockdown: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా ఆలోచన.. షాపుల వద్ద బారులు తీరుతున్న జనాలు
ప్రతీకాత్మక చిత్రం
Follow us

|

Updated on: Mar 09, 2021 | 7:16 PM

Lockdown: దేశ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినా.. పలు రాష్ట్రాల్లో మాత్రం మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ముంబై కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు ఆంక్షలు విధిస్తోంది ముంబై. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో ముంబైలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ముంబై గార్డియన్‌ మినిస్టర్‌ అస్లాం షేక్‌ కూడా ధృవీకరించడమే కాకుండా మరో 8 రో జులు పరిస్థితి సమీక్షించి కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోతే అప్పుడు పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వార్తలు రావడంతో ముంబైలోని అన్ని ప్రాంతాల్లో కిరాణ దుకాణాల వద్ద బారులు తీరారు. నిత్యావసర సరుకుల కోసం భారీగా వస్తున్నారు. అయితే తక్షణమే లాక్‌డౌన్‌ విధించడం లేదని, కరోనా వ్యాప్తి కట్టడిలోకి రాకపోతే పాక్షికంగా లాక్‌డౌన్‌ విధిస్తామని అధికారులు చెబుతున్నారు.

గత వారం రోజులుగా ముంబై వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. దీంతో ప్రభుత్వ అధికారులల్లో సైతం ఆందోళన నెలకొంది. ఆదివారం ఒక్క రోజే 142 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 11.141కి చేరుకుంది. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం నుంచి దాదాపు 2,746 శాంపిల్స్‌ పరీక్షలకు తీసుకెళ్లగా, వాటిay 36 పాజిటివ్‌ కేసులు తేలాయి. ఒక్క ముంబై విమానాశ్రయంలోనే గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి 2021 ఫిబ్రవరి నెలాఖరు వరకు 1408 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్టులో ఇప్పటి వరకు 2.20 లక్షల మంది కరోనా పరీక్షలు జరిపారు. గత నెల 6 నుంచి విమానాశ్రయం ప్రాంగణంలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో తిరిగి కరోనా వ్యాప్తి చెందడం పట్ల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు.

అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదన్న ముఖ్యమంత్రి.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆలోచనలో పడిపోయారు. అయితే కరోనా కట్టడిలోకి రాకపోతే పాక్షికంగా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ఆంక్షలు విధిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించని వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రతి రోజు దాదాపు 8 వేలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అప్పటికప్పుడు లాక్‌డౌన్‌ విధించకుండా కొంత సమయం తీసుకుని అప్పుడు కరోనా అదుపులోకి రాకపోతే పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి చదవండి :

AP Corona: ఏపీలో మళ్లీ వంద మార్క్ దాటిన కరోనా కేసులు.. ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారంటే..?

దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్.. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో డోసుల పంపిణీ

Corona Cases Update In India: దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!