స్టూడెంట్స్ అలర్ట్: వరంగల్ నిట్లో కొత్త కోర్సు..
తెలంగాణలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ వరంగల్ నిట్ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)
తెలంగాణలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ వరంగల్ నిట్ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎంటెక్ (స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్) కోర్సును ప్రారంభించనుంది. ఈ కోర్సు నిర్వహణలో భాగంగా ఏబీబీ పవర్ గ్రిడ్ ఇండియా సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ల మధ్య జూన్ 25న పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
ఇందుకోసం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు, ఏబీబీ పవర్ గ్రిడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. వేణులు ఆన్లైన్లో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రామ్ కార్యరూపం దాల్చనుంది. ఈ కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ ఎస్.గోవర్ధన్రావు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాసరావు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పవర్ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చేలా అవసరమైన స్మార్ట్గ్రిడ్ను రూపొందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు.