AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: మహారాష్ట్రలో భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో 8,333 పాజిటివ్‌ కేసులు

Covid-19: దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య ..

Covid-19: మహారాష్ట్రలో భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో 8,333 పాజిటివ్‌ కేసులు
Subhash Goud
|

Updated on: Feb 26, 2021 | 10:27 PM

Share

Covid-19: దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక మహారాష్ట్రాలో కరోనా కలకలం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో అక్కడ ఏకంగా 8333 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో..మొత్తం కేసుల సంఖ్య 21,38,154కు చేరుకుంది. లోకల్ ట్రెయిన్లు ప్రారంభమవడం కూడా కరోనా కేసులు పెరగడానికి ఓ కారణమని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో కరోనా వ్యాప్తి మరింత తీవ్రతరం అవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్‌గా నిలిచిన ముంబైలో ఇటీవల రోజువారి కరోనా కేసుల సంఖ్య స్వలంగా పెరిగింది. శుక్రవారం నాడు 1,034 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత మూడు రోజుల్లో ముంబైలో సగటున ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు.. శుక్రవారం ఒక్కరజునే మొత్తం 4963 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర రికవరీ రేటు 94.35 శాతంగా ఉంది.

భయాందోళన కలిగిస్తున్న కేసులు

అయితే దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోవడంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగు పెట్టే వారిపై నిఘా పెట్టారు. కరోనా నెగెటివ్‌ రిపోర్టుతో వస్తే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. అలాగే మాస్కులు ధరించని వారిపై కూడా కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో కోట్లాది రూపాయలుగా మాస్కులు ధరించని వారిపై వసూలు చేసినట్లు ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. మరిన్ని ఆంక్షలు విధిస్తేనే కరోనా కట్టడిలోకి వస్తుందని భావించిన అధికారులు.. నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.

Also Read: Coronavirus: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..?