AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఎన్నికల్లో విధ్వంసానికి నక్సల్స్ వ్యూహం ?

బీహార్ ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులను టార్గెట్ చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని నక్సలైట్లు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రచారం కోసం వచ్ఛే వీవీఐపీలను..

బీహార్ ఎన్నికల్లో విధ్వంసానికి నక్సల్స్ వ్యూహం ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 20, 2020 | 11:42 AM

Share

బీహార్ ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులను టార్గెట్ చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని నక్సలైట్లు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రచారం కోసం వచ్ఛే వీవీఐపీలను ఎంచుకుని   వారి మార్హ్గాల్లో మందుపాతరలను అమర్చాలన్నది కూడా వారి కుట్రల్లో భాగమని అధికారులు తెలిపారు. ఐఈడీ ల్యాండ్ మైన్స్ ని వారు అప్పుడే సిధ్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీహార్ తో బాటు ఝార్ఖండ్ సరిహద్దులోనూ ఉద్రిక్తత సృష్టించాలని వారు వ్యూహం పన్నుతున్నారు అని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. పార్టీలతో నిమిత్తంలేకుండా ఏ పార్టీ నాయకుడినైనా టార్గెట్ చేయాలని, పోలింగ్ ను అడ్డుకోవాలని వారు యోచిస్తున్నారట. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్ఛరికతో బీహార్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.