ఆ దోషాలకు బెస్ట్.. ఎర్ర పప్పు వాస్తు పరిహారాలు తెలుసా?
Samatha
2 July 2026
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తుంటారు.
జ్యోతిష్య శాస్త్రం
అయితే ప్రతి ఒక్కరూ ఉద్యోగ ప్రయత్నం చేస్తారు. కానీ అందులో కొంత మంది మాత్రమే చాలా త్వరగా జాబ్ సంపాదించుకొని, జీవితంలో గొప్పగా బతుకుతుంటారు.
ఉద్యోగ ప్రయత్నం
మరికొంత మంది ఉద్యోగం చేస్తున్నా, అందులో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాగా ఉద్యోగంలో సమస్యలతో బాధపడే వారు ఉద్యోగం కోసం వెతుకులాడే వారు తప్పకుండా ఈ పప్పు పరిహారం పాటించాలంట.
సమస్యలు
కుజుడి ప్రభావం వలన వృత్తిలో ఆటంకాలు, అడ్డంకులు ఎదురు అవుతాయి. అయితే అలాంటి సమయంలో ఎర్ర పప్పు, కందిప్పు వాటితో కొన్ని పరిహారాలు చేయడం వలన ఇది వాస్తు సమస్యలను , ఉద్యోగంలో ఇబ్బందులను తొలిగిస్తుందంట.
ఆటంకాలు, అడ్డంకులు
గుప్పెడు ఎర్ర పప్పును తీసుకోవాలి. శివాలయానికి వెల్లి రాగిపాత్రలో మంచి నీరు తీసుకొని అందులో పప్పులు వేసి, ఓం నమ:శివాయ అనే మంత్రి జపిస్తూ శివలింగానికి సమర్పించాలి నీటిని.
దోషాలు
అలాగే సోమవారం రోజున శివలింగానికి పప్పును నైవేద్యంగా పెట్టడం వలన కూడా ఆర్థిక బాధలు తొలిగిపోతాయి. కోరిన కోర్కెలు నెరవేరుతాయంట.
ఆర్థిక బాధలు
అదే విధంగా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే వారు గుప్పెడు ఎర్ర కందిపప్పు తీసుకొని , పారే నీటిలో వేయడం వలన సమస్యలు తగ్గిపోతాయంట.
ఉద్యోగంలో సమస్యలు
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.