రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఆరు వాహనాలు దగ్ధం..
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు టిప్పర్లు, రెండు జేసీబీలు, మరో రెండు పోక్లైన్ల కాలిపోయాయి.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు టిప్పర్లు, రెండు జేసీబీలు, మరో రెండు పోక్లైన్ల కాలిపోయాయి. సుక్మా జిల్లాలోని కుకనార్ ప్రాంతలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్పీ శలభ్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11.00 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఘటన జరిగిన సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులతో పాటు.. సీఆర్పీఎఫ్ బలగాలు కుకనార్ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి.
కాగా, మంగళవారం నాడు.. నారాయణ్పూర్ జిల్లాలో పేలిన ఐఈడీ బ్లాస్ట్లో ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్కు చెందిన ఓ జవాన్ గాయాలపాలయ్యాడు. ఇక మావోయిస్టులు ఇలా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వాహనాలను తగులబెట్టడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా వాహనాలను తగులబెట్టారు.
Chhattisgarh: Naxals have set ablaze 6 vehicles including 2 JCBs engaged in road construction in Kukanar area of Sukma district, yesterday. pic.twitter.com/3s9mT9CgcM
— ANI (@ANI) June 25, 2020