AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వీడేం మనిషి రా బాబు.. ఏకంగా 25 కుక్కలను.. రంగంలోకి పోలీసులు.. వీడియో వైరల్..

రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఒక వ్యక్తి తుపాకీతో 25 కి పైగా కుక్కలను కాల్చి చంపడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Watch: వీడేం మనిషి రా బాబు.. ఏకంగా 25 కుక్కలను.. రంగంలోకి పోలీసులు.. వీడియో వైరల్..
Man Killed 25 Dogs
Krishna S
|

Updated on: Aug 07, 2025 | 5:40 PM

Share

కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. అందుకే చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి మక్కువ చూపిస్తారు. ప్రమాద సమయాల్లో యజమాని కోసం ప్రాణాలను పణంగా పెడతాయి కుక్కలు. అయితే గత కొన్నాళ్లుగా కుక్కల దాడుల్లో చిన్నారులు మరణించడం కలకల రేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పరిస్థతి ఆందోళన కలిగిస్తుంది. తాజాగా రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జుంజును జిల్లాలో 25 కి పైగా కుక్కలను కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఓ గ్రామంలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని తిరుగుతూ కనిపించన కుక్కను కాల్చుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జుంజును జిల్లాలోని నవల్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమావాస్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్త భుజానికి తుపాకీ వేసుకుని బైక్‌పై కుక్కలను వెతుక్కంటూ వెళ్లాడు. అలా కనిపించిన కుక్కను కాల్చుకుంటూ పోయాడు. ఇప్పటివరకు 25 కి పైగా కుక్కలను చంపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు హమిరి గ్రామ మాజీ సర్పంచ్ సరోజ్ తెలిపారు. దుమ్రా నివాసి అయిన షియోచంద్ ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కుక్కల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. కుక్కలను చంపడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాలను చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?