మాల్దీవులు దివాలా? స్వరం మార్చి కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు.. భారత్ విషయంలో అలా ఎప్పటికీ జరగదంటూ..

మాల్దీవులు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు.. అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారత్‌తో తన సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో బిజీగా ఉన్నారు. అందుకే చైనాను పొగిడినా భారత్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తమ దేశం నుంచి భారత సైనికులు తిరిగి వెళ్ళిపోవాలని మాల్దీవులు కోరింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

మాల్దీవులు దివాలా? స్వరం మార్చి కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు.. భారత్ విషయంలో అలా ఎప్పటికీ జరగదంటూ..
Maldives President India Tour
Follow us

|

Updated on: Oct 07, 2024 | 9:43 AM

భారత్ అవుట్ అన్న నినాదంతో మాల్దీవులలో అధికారం చేపట్టిన మొహమ్మద్‌ ముయిజ్జు.. తర్వాత చైనాకు దగ్గరగా భారత్ దూరంగా జరుగుతూ వచ్చారు. హిందూ మహాసముద్రంలో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయిన మాల్దీవులు.. చైనాతో సంబంధాలను పెంచుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోన్న నేపధ్యంలో మన దేశంలో అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు అడుగు పెట్టారు. భారత్‌లో తొలిసారి ద్వైపాక్షిక పర్యటన కోసం ముయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌ కూడా ఉన్నారు. అయితే ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి.. కాగా తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి ముయిజ్జు అతిధిగా హాజరయ్యారు.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్న తర్వాత అతని స్వరం మారినట్లుంది. చైనాకు మద్దతిచ్చే ముయిజ్జు భారత్ పట్ల తన విధేయతను ప్రదర్శించి చైనాకు సందేశం ఇచ్చాడు. భారతదేశ భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎప్పటికీ చేయదని ఆయన స్పష్టం చేశారు.

మాల్దీవులు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు.. అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారత్‌తో తన సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో బిజీగా ఉన్నారు. అందుకే చైనాను పొగిడినా భారత్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తమ దేశం నుంచి భారత సైనికులు తిరిగి వెళ్ళిపోవాలని మాల్దీవులు కోరింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

భారత భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎన్నటికీ

చైనాతో మాల్దీవుల సంబంధాల వల్ల భారత్ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని అధ్యక్షుడు ముయిజ్జు ఆదివారం స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ‘భారత భద్రతకు హాని కలిగించే పనిని మాల్దీవులు ఎన్నటికీ చేయదు. భారతదేశం మాల్దీవులకు విలువైన భాగస్వామి, స్నేహితుడు. తమ సంబంధాలు పరస్పర గౌరవం , ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. తాను అన్ని రంగాలలో ఇతర దేశాలతో తన సహకారాన్ని మెరుగుపరురుచుకుంటానని.. తన చర్యలు తమ ప్రాంతం భద్రత , స్థిరత్వానికి రాజీ పడకుండా చూసుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.

భారత దళాల ఉపసంహరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి ఎదురైన ప్రశ్నకు ముయిజ్జు బదులు ఇస్తూ దానిని దేశీయ ప్రాధాన్యతగా పరిగణించాలని అన్నారు. మాల్దీవులు, భారతదేశం ఇప్పుడు ఒకరి ప్రాధాన్యతలు ఒకరు, ఒకరి ఆందోళనలను ఒకరు బాగా అర్థం చేసుకున్నాయని చెప్పారు. మాల్దీవుల ప్రజలు ఏం చేయమని కోరారో అదే చేశాను. ఇటీవలి మార్పులు దేశానికి మొదటి స్థానం అనేది తమ విధానమని, భారత్‌తో దీర్ఘకాల, విశ్వసనీయ సంబంధానికి విలువ ఇస్తూనే ఉంటామని చెప్పారు. ఇతర దేశాలతో మా సంబంధాలు భారతదేశ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీయవని తాను విశ్వసిస్తున్నట్లు బలమైన, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తామని మయిజ్జు అన్నారు.

మాల్దీవులు దివాలా?

భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని.. తన పర్యటనతో రెండు దేశాల బంధం మరింత బలపడుతుందని చెప్పారు. అప్పు తీర్చలేక మాల్దీవులు దివాళా తీసే దశకు చేరుకుంది. ప్రస్తుతం మాల్దీవుల విదేశీ మారక నిల్వలు 440 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ముయిజ్జు అధ్వర్యంలో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం “ఇండియా అవుట్” ప్రచార పతాకాన్ని ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన.. మాల్దీవుల్లో విదేశీ దళాలు ఉండడంతో తనకు ఇబ్బంది ఉందని.. అయితే తాను ఏ దేశానికి వ్యతిరేకం కాదని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాల్దీవులు దివాలా? భారత్ తో కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు..!
మాల్దీవులు దివాలా? భారత్ తో కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు..!
అప్పుడు స్లిమ్‌గా.. ఇప్పుడు బబ్లీగా.. ఈ నటి ఎవరో గుర్తు పట్టారా?
అప్పుడు స్లిమ్‌గా.. ఇప్పుడు బబ్లీగా.. ఈ నటి ఎవరో గుర్తు పట్టారా?
అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే.. ఏకంగా పెళ్లి చేసేశారు
అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే.. ఏకంగా పెళ్లి చేసేశారు
ప్రయాణం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది
ప్రయాణం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది
చైనా పౌరులే లక్ష్యంగా పాక్ లో పేలుడు.. ముగ్గురు మృతి
చైనా పౌరులే లక్ష్యంగా పాక్ లో పేలుడు.. ముగ్గురు మృతి
తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్
తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో?
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో?
కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
రేపే గరుడోత్సవం నేటిఅర్థరాత్రి నుంచి కనుమరహదారుల్లో బైక్స్ నిషేధం
రేపే గరుడోత్సవం నేటిఅర్థరాత్రి నుంచి కనుమరహదారుల్లో బైక్స్ నిషేధం
సాధారన డిగ్రీతో ఏడాదికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీతో 'Google' జాబ్
సాధారన డిగ్రీతో ఏడాదికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీతో 'Google' జాబ్
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.