AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడిపోయిన పలు వాహనాలు, ముగ్గురు మృతి!

గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహిసాగర్ నదిపై 40 ఏళ్ల క్రితం నిర్మించిన భారీ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించినగా మరికొందరు నది నీటిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదం కారణంగా చాలా వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని రక్షించారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగింది.

Watch Video: గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడిపోయిన పలు వాహనాలు, ముగ్గురు మృతి!
Bridge Collapse
Anand T
|

Updated on: Jul 09, 2025 | 1:13 PM

Share

గుజరాత్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఆనంద్‌ జిల్లాలోని ఓ భారీ వంతెన కూలిపోయి ముగ్గురు వ్యక్తులు మరణించగా పలువురు నది నీటిలో గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. గుజరాల్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఉన్న మహిసాగర్ నదిపై 40 సంవత్సరాల క్రితం ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనకు ఆత్మహత్యల నిలయం అనే మరో పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ వంతెనపై నుంచి దూకి ఇప్పటి వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా ఉన్న వారు దీన్ని అలా పిలుస్తున్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ వంతెన నిర్మించి చాలా ఏళ్లు కావడంతో దీనికి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ వంతెన పక్కనే కొత్త వంతెన నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం కూడా లభించింది. కానీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు.

అయితే కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా.. పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేయలేదు. ఇప్పటికే మరమ్మత్తులు అవసరమైన వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు మరింత శిథిలావస్థకు చేరుకుంది.ఈ క్రమంలోనే బుధవారం వాహనరాకపోకలు సాగిస్తున్న సమయంలో బ్రిడ్జ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరికొందరు నది నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. కాగా బ్రిడ్జ్‌ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

బ్రిడ్జ్‌ కూలిన ఘటనకు సంబంధించిన వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు