AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Interview: నా లక్ష్యం 2047.. ప్రాణం పోయినా మాట తప్పను.. ఇది మోదీ గ్యారంటీః మోదీ

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ పెద్ద ఇంటర్వ్యూ వెలువడింది. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కేవలం విపక్ష నేతలను మాత్రమే టార్గెట్‌ చేస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మోదీ. ఈడీ అరెస్ట్‌ చేస్తున్న వారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే రాజకీయ నేతలు ఉన్నారన్నారు.

PM Modi Interview: నా లక్ష్యం 2047..  ప్రాణం పోయినా మాట తప్పను.. ఇది మోదీ గ్యారంటీః మోదీ
Pm Modi Ani Interview
Balaraju Goud
|

Updated on: Apr 15, 2024 | 8:51 PM

Share

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ పెద్ద ఇంటర్వ్యూ వెలువడింది. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కేవలం విపక్ష నేతలను మాత్రమే టార్గెట్‌ చేస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మోదీ. ఈడీ అరెస్ట్‌ చేస్తున్న వారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే రాజకీయ నేతలు ఉన్నారన్నారు. ఈడీ అరెస్ట్‌ చేసిన వారిలో 97 శాతం మంది అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులు , బినామీ సంపద ఉన్న అధికారులే ఉన్నారన్నారు.

ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రధాని మోదీ హిందుత్వానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దామన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రుద్రాక్షలు ధరించి తిరిగేవారని, అయితే సనాతన్‌పై ఆమె పార్టీ ఎందుకు విషం చిమ్ముతుందని సనాతన్ సమస్యకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని మోదీ అన్నారు. ఇక పేదరికాలన్ని చిటికెలో మాయం చేస్తానని ఓ నేత అంటున్నారని రాహుల్‌గాంధీపై పరోక్షంగా సెటైర్లు వేశారు మోదీ. ఇలాంటి నేతల్లో రాజకీయ శూన్యత కన్పిస్తోందన్నారు.

రాజ్యాంగ సభలో ప్రజలు కూర్చున్నప్పుడు, వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ భావజాలం ఉన్నవారే. మొదటి రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు, దాని మొదటి పేజీలోని చిత్రాలు సనాతన్ సంప్రదాయానికి సంబంధించినవి. రాజ్యాంగం రూపొందించినప్పుడు అందులో సనాతన్ గౌరవ్ భాగం ఉంది. ఈరోజు సనాతన్‌కు ధైర్యం చాలక దుర్భాషలాడిన వారితో వేదికను పంచుకుంటున్నారు. ఇది దేశానికి ఆందోళన కలిగించే అంశంగా అభివర్ణించారు ప్రధాని మోదీ.

డీఎంకే సనాతన ధర్మాన్ని అవమానించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎలాన్‌ మస్క్‌ భారత్‌కు రావడం శుభపరిణామని, దేశానికి ఆయన పర్యటనతో ఎంతో లాభం ఉందన్నారు. పదేళ్ల తన పాలనను, 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను దేశ ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు మోదీ. ఎలక్టోరల్‌ బాండ్స్‌తో పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ను పూర్తిగా సమర్ధించారు మోదీ. ఎలక్టోరల్‌ బాండ్స్‌పై రాహుల్‌ విమర్శలను తిప్పికొట్టారు మోదీ. ఇప్పుడు ఎలక్టోరల్‌ బాండ్స్‌ను విమర్శిస్తున్న వాళ్లు తరువాత పశ్చాత్తాపపడుతారని అన్నారు.

అదే సమయంలో, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానంగా, దురదృష్టవశాత్తు ఈ రోజు మన మాటలకు మాకు బాధ్యత లేదని ప్రధాని మోదీ అన్నారు. ‘ఒకే దెబ్బలో పేదరికాన్ని తొలగిస్తాను’ అని ఓ నాయకుడు చెప్పడం విన్నాను. 5-6 దశాబ్దాలు దేశాన్ని పాలించిన వారు నేడు పేదరికాన్ని ఒక్క దెబ్బతో తొలగిస్తామని చెప్పారు. అవి విని, వారు ఏమి చెప్తున్నారో ప్రజలు ఆశ్చర్యపోతారు. నాయకులు బాధ్యత వహించాలి. మనం చెప్పే మాటలను ప్రజలు విశ్వసిస్తారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజకీయాల్లో ఉత్తర-దక్షిణ భారత విభజనపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. తమిళనాడు సహా దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నేతల ప్రకటనలపై ప్రధాని మోదీ భారతదేశం బహురత్న వసుంధర అని, భిన్నత్వంతో నిండిన దేశమని అన్నారు. భారతదేశాన్ని ముక్కలుగా చూడడం అంటే భారత్ పట్ల ఉన్న అపార్థం ఫలితమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇదే భావన అయితే భారతదేశంలో రాముడి పేరుతో అత్యధిక సంఖ్యలో గ్రామాలు తమిళనాడులో ఉన్నాయన్నారు. భారతదేశపు పుష్పగుచ్ఛంలో ప్రతి ఒక్కరూ తమ సొంత పువ్వును చూడాలనే భావన ఉండాలని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…