AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పేదల హక్కులను కాంగ్రెస్ హరించింది.. గత పదేళ్లలో దేశం దూసుకుపోతుందిః ప్రధాని మోదీ

మావోయిస్టుల కంచుకోట బస్తరలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. చత్తీస్‌గడ్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సొమ్మును లూటీ చేసిందని ఆరోపించారు మోదీ. తాను అవినీతిపై యుద్దం ప్రకటిస్తే విపక్షాలు మోదీ గ్యారంటీలపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవినీతిని అంతం చేస్తానని అన్నారు.

PM Modi: పేదల హక్కులను కాంగ్రెస్ హరించింది.. గత పదేళ్లలో దేశం దూసుకుపోతుందిః ప్రధాని మోదీ
Pm Modi In Bastar
Balaraju Goud
|

Updated on: Apr 08, 2024 | 3:41 PM

Share

మావోయిస్టుల కంచుకోట బస్తరలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. చత్తీస్‌గడ్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సొమ్మును లూటీ చేసిందని ఆరోపించారు మోదీ. తాను అవినీతిపై యుద్దం ప్రకటిస్తే విపక్షాలు మోదీ గ్యారంటీలపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవినీతిని అంతం చేస్తానని అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన విజయ్ సంకల్ప్ శంఖనాద్ మహారాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పేదల గురించి కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు పేదల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. పేదలకు హక్కులు కల్పించి సగౌర్వంగా జీవించేలా చేశామన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మరోసారి మోదీ సర్కార్ అంటున్నారు. దేశంలోని ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటానని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు..

బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఒక్కొక్కటిగా పథకాలు తీసుకువచ్చి వారి హక్కులను కల్పించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కృషి ఫలితంగానే దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. పేదవారి ప్రతి ఆందోళనను తొలగించే వరకు విశ్రమించనని నిర్ణయించుకున్నానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రారంభించామన్నారు. ఆయుష్మాన్ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు.

దశాబ్దాల తర్వాత దేశం సుస్థిరమైన, బలమైన బీజేపీ ప్రభుత్వాన్ని చూసిందని ప్రధాని మోదీ అన్నారు. పేదల సంక్షేమమే మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. స్వాతంత్య్రానంతరం పేదల అవసరాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలుగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదల గురించి పట్టించుకోలేదు, వారి సమస్యలను అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ కుటుంబంలోని ధనవంతులకు ద్రవ్యోల్బణం అంటే అర్థం కాలేదన్నార ప్రధాని మోదీ.

పేదలకు ఉచితంగా రేషన్‌, వ్యాక్సిన్‌ ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. కరోనా కాలాన్ని ప్రస్తావిస్తూ, ప్రధాని మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రజలు భారతదేశం ఎలా మనుగడ సాగిస్తుందని చెప్పేవారు? కాంగ్రెస్ హయాంలో దేశంలో వ్యాక్సిన్ రావడానికి దశాబ్దాలు పట్టేది. భారత దేశంలోని ప్రతి పేదవాడికి అండగా ఉంటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పేదలకు ఉచితంగా వ్యాక్సిన్, ఉచితంగా రేషన్ ఇచ్చామని గుర్తు చేశారు.

2014కి ముందు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి వస్తే, అదీ గ్రామాలకు 15 పైసలు మాత్రమే వచ్చేవి. మిగిలిన 85 పైసలను కాంగ్రెస్ వారే కొల్లగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ దోచుకునే ఈ వ్యవస్థను ఆపానని స్పష్టం చేశారు మోదీ. అవినీతిపరుల నల్లధనాన్ని అడ్డుకున్నానని, . బీజేపీ ప్రభుత్వం తన పదేళ్లలో రూ.34 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పంపించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us