ఎయిమ్స్‌కు ఎల్‌కె అద్వానీ

ఈ నెల 10వ తేదీ నుంచి ఎయిమ్స్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీని బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ పరామర్శించారు. వైద్యులను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జైట్లీ ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద ఉన్నారు. ఇప్పటికే అనేకమంది నేతలు, మంత్రులు జైట్లీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాగా ఈ నెల 9న జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో, ఎయిమ్స్‌కు తరలించారు. ఆపై 10వ తేదీన […]

ఎయిమ్స్‌కు ఎల్‌కె అద్వానీ
Follow us

|

Updated on: Aug 19, 2019 | 4:48 PM

ఈ నెల 10వ తేదీ నుంచి ఎయిమ్స్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీని బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ పరామర్శించారు. వైద్యులను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జైట్లీ ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద ఉన్నారు. ఇప్పటికే అనేకమంది నేతలు, మంత్రులు జైట్లీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాగా ఈ నెల 9న జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో, ఎయిమ్స్‌కు తరలించారు. ఆపై 10వ తేదీన ఆయన ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు వైద్యులు. తిరిగి ఇంతవరకూ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై మరో హెల్త్‌ బులిటెన్‌ విడుదల కాలేదు.