AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mid-day Meals: మధ్యాహ్న భోజనంలో ఇవి ఇవ్వడం సరికాదు.. విద్యార్థుల జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి..

మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, మాంసం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో జీవనశైలి లోపాలు తలెత్తుతాయని పేర్కొంది. కర్నాటక విద్యా విధాన ప్యానెల్ సమర్పించిన పొజిషన్ పేపర్‌లో..

Mid-day Meals: మధ్యాహ్న భోజనంలో ఇవి ఇవ్వడం సరికాదు.. విద్యార్థుల జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి..
Eggs And Meat In Mid Day Me
Sanjay Kasula
|

Updated on: Jul 15, 2022 | 8:32 PM

Share

కేంద్ర ప్రభుత్వానికి కర్నాటకకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఇపి) ప్యానెల్ కొత్త సలహా ఇచ్చింది. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, మాంసం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో జీవనశైలి లోపాలు తలెత్తుతాయని పేర్కొంది. కర్నాటక విద్యా విధాన ప్యానెల్ సమర్పించిన పొజిషన్ పేపర్‌లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు, మాంసాన్ని తొలగించాలని సూచించింది. ఈ ప్రతిపాదన లేఖలో, మనస్సు, భావోద్వేగాల మెరుగుదల కోసం సాత్విక ఆహారం తినాలని కూడా సిఫార్సు చేయబడింది. కొత్త జాతీయ విద్యా విధానం గురించి కేంద్రానికి సూచించాల్సిందిగా రాష్ట్రాలను కోరిన ప్రక్రియలో ఈ పొజిషన్ పేపర్ భాగం.

విధానంలో భాగంగా వాటిని అమలు చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పేపర్‌లను సమీక్షిస్తాయి. పాఠశాల పాఠ్యాంశాలపై పేపర్ రెడీ చేసేందుకు 26 కమిటీలను ఏర్పాటు చేసింది కర్నాటక ప్రభుత్వం. ఈ కమిటీల్లో ఒక అధ్యక్షుడు, ఐదు నుంచి ఆరుగురు విద్యావేత్తలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 26 కమిటీలు ఈ పేపర్ రెడీ చేశాయి. అన్ని కమిటీల అభిప్రాయం ఒకేలా ఉండటం విశేషం.

ఆఫర్ లెటర్‌లో ఏం చెప్పారంటే..

ఇవి కూడా చదవండి

కర్నాటక ప్రభుత్వానికి “ఆరోగ్యం, శ్రేయస్సు” అనే పేరుతో పేపర్ రెడీ చేశారు. భారతీయుల జీవన చక్రంలో గుడ్లు, మాంసం సాధారణ వినియోగం నుంచి కొలెస్ట్రాల్ అనేవి విద్యార్థుల జీవనశైలిలో అనారోగ్యకారణంగా మారుతున్నాయని సూచించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌లో చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ విభాగం అధిపతి కె జాన్ విజయ్ సాగర్ ఈ ప్రతిపాదన లేఖకు కమిటీ అధ్యక్షత వహించారు. 

పిల్లలకు గుడ్లు, బిస్కెట్లు..

జంతు ఆధారిత ఆహారాల వల్ల భారతదేశంలో మధుమేహం, ప్రి డయాబెటిక్, ప్రాధమిక వంధ్యత్వం వంటి రుగ్మతలు వస్తున్నాయని ఈ కమిటీ తేల్చింది. “స్థూలకాయం, హార్మోన్ల అసమతుల్యత” నివారించడానికి పిల్లల ఆహారంలో గుడ్లు, బిస్కెట్లు దూరంగా ఉండాలని పేర్కొంది. పిల్లలందరినీ సమానంగా.. ‘పంటి బేధా’ (ఆహార వివక్షత) లేకుండా చూడటం ప్రామాణికమైన భారతీయ తత్వశాస్త్రంలో చెప్పినట్లుగా పేపర్‌లో పేర్కొంది కమిటీ. 

అమ్మమ్మ వంటలు.. 

ధర్మం, అర్థ, కామ, మోక్షం అనే నాలుగు జీవిత లక్ష్యాలను సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలని ఈ కమిటీ పేర్కొంది. ధర్మం, శ్రేయస్సు, ఆనందం, విముక్తి అనే నాలుగు గుణాలు మానవజాతి లక్ష్యం కావాలి. ఆహారం మంచిదో చెడ్డదో గుర్తు చేసే పట్టికను కూడా తయారు చేశారు. ఉదాహరణకు.. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, మాంసం తినడం ఆరోగ్యానికి హనికరం అని వర్ణించబడింది. అయితే అమ్మమ్మ పద్ధతిలో బడి పిల్లలకు మిడ్‌ డే మీల్స్ అందించడం మంచిదని వర్ణించబడింది.

జాతీయ వార్తల కోసం..

Follow Us
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం