Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలితో గొడవ.. ఆగ్రహంతో రూ.70 లక్షల బెంజ్ కారును తగులబెట్టిన యువ డాక్టర్‌..

కానీ, అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు ధర్మపురి జిల్లాకు చెందిన గవిన్ అనే వ్యక్తికి చెందినదని తేలింది.

ప్రియురాలితో గొడవ.. ఆగ్రహంతో రూ.70 లక్షల బెంజ్ కారును తగులబెట్టిన యువ డాక్టర్‌..
Car Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 27, 2023 | 9:08 AM

ఇద్దరు ప్రేమికుల మధ్య వివాదం కార్చిచ్చుగా మారింది. ప్రియురాలిపై ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు.. ఖరీదైన కారును తగులబెట్టేశాడు. కాంచీపురం పక్కనే ఉన్న రాజకుళం ప్రాంతంలోని కులైకరై సమీపంలో బెంజ్ కారులో యువ జంట మాట్లాడుకుంటుండగా.. యువతీ , యువకుల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవ మొదలైంది. వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది.. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియుడు తన సొంత బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చెరువు సమీపంలో కారు కాలిపోతున్నట్లు గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు ధర్మపురి జిల్లాకు చెందిన గవిన్ అనే వ్యక్తికి చెందినదని తేలింది.

గావిన్ కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి గతేడాది పట్టభద్రుడయ్యాడు. ఈ సందర్భంలో అదే కాలేజీకి చెందిన తోటి విద్యార్థిని కావ్యతో ప్రేమలో పడ్డాడని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంచీపురం పక్కనే ఉన్న రజకులం ప్రాంతంలో ప్రియురాలితో మాట్లాడుతుండగా.. విబేధాలు రావడంతో ఆగ్రహించిన గావిన్.. 70 లక్షల రూపాయల విలువైన తన సొంత లగ్జరీ కారు (బెంజ్)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై కాంచీపురం తాలూకా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..