AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్లో భద్రతా బలగాల భారీ విషయం.. పాక్ ఉగ్రవాది హతం.. లష్కర్ కమాండర్ సజాద్ గుల్ కుడి భుజంగా గుర్తింపు

జమ్మూలోని శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్‌ను హతమార్చారు. అతను లష్కర్ కమాండర్ సజాద్ గుల్‌కు కుడి భుజంగా పరిగణించబడుతున్నాడు. ఉస్మాన్ కోడ్ పేరు "ఛోటా వాలిద్".. అతను కాశ్మీర్‌లోని లష్కరే తోయిబాకి అత్యంత సీనియర్ కమాండర్‌గా పరిగణించబడ్డాడు.

కశ్మీర్లో భద్రతా బలగాల భారీ విషయం.. పాక్ ఉగ్రవాది హతం.. లష్కర్ కమాండర్ సజాద్ గుల్ కుడి భుజంగా గుర్తింపు
Jammu Kashmir Encounter
Surya Kala
|

Updated on: Nov 03, 2024 | 8:00 AM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్‌ను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. అతనికి గత 20 ఏళ్లుగా లష్కర్‌తో సంబంధం ఉంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో సజాద్ గుల్‌కు కుడి భుజంగా పరిగణించబడుతున్నాడు. ఉస్మాన్ హత్యతో లష్కర్ నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఉస్మాన్ సంస్థ కోసం చురుకుగా పనిచేస్తున్నాడని లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ నమ్ముతోంది.

లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థలో ఉస్మాన్ కోడ్ పేరు “ఛోటా వాలిద్”. ఇతను కాశ్మీర్‌లోని లష్కరే తోయిబాకి సంబధించిన అత్యంత సీనియర్ కమాండర్‌గా పరిగణించబడుతున్నాడు. ఇటీవలి కాలంలో ఇతని కార్యకలాపాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ కారణంగా అతను భద్రతా దళాల హిట్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. 2023 అక్టోబర్‌లో శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో స్థానిక క్రికెట్ గేమ్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్య కేసులో ఉస్మాన్ పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. భద్రతా బలగాల చెప్పిన ప్రకారం ఉస్మాన్ మరణం కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతాదళాలు సాధించిన ఒక భారీ విజయం అని తెలుస్తోంది.

ఐజీపీ వీకే బిర్డీ ఏం చెప్పారు?

ఇవి కూడా చదవండి

భద్రతా దళాల చేతిలో హతమైన ఉగ్రవాదిని ఉస్మాన్‌గా గుర్తించినట్లు ఐజీపీ వీకే బిర్డి తెలిపారు. అతను లష్కర్ కమాండర్. ఈ ఆపరేషన్‌లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని చెప్పారు. ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్యలో హతమైన ఉగ్రవాది పాత్ర, ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు.

ఖన్యార్‌ ఎన్‌కౌంటర్‌లో ఉస్మాన్‌ మృతి

ఖన్యార్‌ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ఘటనా స్థలం నుంచి ఉస్మాన్ మృతదేహంతో పాటు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ సెప్టెంబర్ 15, 2022 తర్వాత శ్రీనగర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద ఎన్‌కౌంటర్‌గా పరిగణించబడుతుంది.

24 గంటల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

గత 24 గంటల్లో కాశ్మీర్‌లో జరిగిన మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్లు శ్రీనగర్, బందిపొరా, అనంతనాగ్ ప్రాంతాల్లో సాగాయి. అనంత్‌నాగ్ అడవుల్లో శనివారం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. బందిపొరాలో ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మూడు చోట్లా సెర్చ్ ఆపరేషన్లలో భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి.

ఈ ఎన్ కౌంటర్లు, ఉగ్రవాదుల నిర్మూలనతో కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు కొంతమేర తగ్గుతాయని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఉస్మాన్ లాంటి ప్రమాదకరమైన ఉగ్రవాదిని హతమార్చడం వల్ల లష్కరే తోయిబా నెట్‌వర్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. కాశ్మీరీ పండిట్‌లు, సిక్కులు, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నాయి భద్రతా దళాలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..