AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్ అధికారి మహ్మద్ ఇంతియాజ్

జమ్మూ జిల్లాలోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ శనివారం(మే 10) అమరుడయ్యాడు. ఆయన బలిదానాన్ని ధృవీకరిస్తూ, BSF మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.

పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్ అధికారి మహ్మద్ ఇంతియాజ్
Bsf Sii Md Imteyaz
Balaraju Goud
|

Updated on: May 11, 2025 | 1:34 AM

Share

జమ్మూ జిల్లాలోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ శనివారం(మే 10) అమరుడయ్యాడు. ఆయన బలిదానాన్ని ధృవీకరిస్తూ, BSF మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్‌లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడ్డాడు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

“మే 10, 2025న జమ్మూ జిల్లాలోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుపై సరిహద్దు కాల్పుల సమయంలో దేశ సేవలో బిఎస్‌ఎఫ్‌కు చెందిన ధైర్యవంతుడైన సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాము. బిఎస్‌ఎఫ్ సరిహద్దు పోస్టుకు నాయకత్వం వహిస్తూ, ముందు వరుసలో ధైర్యంగా నాయకత్వం వహించారు” అని బిఎస్‌ఎఫ్ జమ్మూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. DG BSF, అన్ని ర్యాంకుల అధికారులు అతని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆదివారం(మే 11) జమ్మూలోని పలౌరాలోని ఫ్రాంటియర్ హెడ్‌క్వార్టర్స్‌లో పూర్తి గౌరవాలతో పుష్పగుచ్ఛాల కార్యక్రమం జరుగుతుంది” అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

IB పై పాకిస్తాన్ కాల్పులు జరిపిన సమయంలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంతియాజ్ తన యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. అసాధారణమైన ధైర్యం, విధి పట్ల అంకితభావాన్ని ప్రదర్శించాడు.

శనివారం తెల్లవారుజామున జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన మోర్టార్, డ్రోన్ దాడుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారి, ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెసిఓ) సహా ఆరుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. షెల్లింగ్ బాధిత నివాస ప్రాంతాలను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సందర్శించారు. సీమాంతర షెల్లింగ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదే సమయంలో, పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసి, ధ్వంసమైన డ్రోన్‌లు, మోర్టార్ల అవశేషాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.

Follow Us
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం