AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. 200 అడుగుల లోతులో పడ్డ ఆర్మీ వాహనం.. 10మంది సైనికులు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. దోడా ప్రాంతం గుండా వెళుతుండగా ఆర్మీ కాస్పర్ ట్రక్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. కాస్పర్ ట్రక్ దోడాలోని భదేర్వా-చంబా రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఆర్మీ వాహనం అదుపుతప్పి దాదాపు 200 అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది.

ఘోర ప్రమాదం.. 200 అడుగుల లోతులో పడ్డ ఆర్మీ వాహనం.. 10మంది సైనికులు మృతి
Indian Army,doda
Balaraju Goud
|

Updated on: Jan 22, 2026 | 3:05 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. దోడా ప్రాంతం గుండా వెళుతుండగా ఆర్మీ కాస్పర్ ట్రక్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది భారత సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 7 మంది గాయపడ్డారు. కాస్పర్ ట్రక్ దోడాలోని భదేర్వా-చంబా రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఆర్మీ వాహనం అదుపుతప్పి దాదాపు 200 అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సైనికులను బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు వేగంగా పనిచేస్తున్నాయి.

ఎత్తైన పర్వత వైపు వెళ్తున్న ఆర్మీ వాహనంలో మొత్తం 17 మంది సైనికులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి జారిపడి 200 అడుగుల లోతైన గుంటలో పడిపోయింది. వాహనం రోడ్డు పక్కన లోయలో పడిపోయిందని ఒక అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టామన్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ, రిలీఫ్ బృందాలను సంఘటనా స్థలానికి పంపించామన్నారు. గాయపడిన సైనికులను ప్రమాద స్థలం నుండి తరలించి సమీపంలోని వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ ముగ్గురు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా పరిస్థితి సున్నితంగానే ఉంటుంది. ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు,యు భద్రతా దళాల కార్యకలాపాలు పెరిగాయి. దోడా జిల్లాలో, ముఖ్యంగా పర్వతాలు, అటవీ ప్రాంతాలలో ఉగ్రవాదుల ఉనికి గురించి ఆందోళన పెరుగుతోంది. దోడా తోపాటు పొరుగున ఉన్న కిష్త్వార్ జిల్లాలో 30-35 మంది పాకిస్తాన్ సంతతికి చెందిన ఉగ్రవాదులు అడవుల్లో దాక్కుని చురుకుగా ఉండవచ్చని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపట్టామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..