Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piyush Goyal: భవిష్యత్తులో ఆ రంగంలో అపార అవకాశాలు.. ఎగుమతులపై దృష్టిసారించాలన్న కేంద్రమంత్రి

దేశంలో పాదరక్షల రంగం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందనుందని, దాదాపు 10 రెట్ల అభివృద్ధి ఈ రంగంలో సాధించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్..

Piyush Goyal: భవిష్యత్తులో ఆ రంగంలో అపార అవకాశాలు.. ఎగుమతులపై దృష్టిసారించాలన్న కేంద్రమంత్రి
Central Minister Piyush Goyal
Amarnadh Daneti
|

Updated on: Oct 08, 2022 | 2:25 PM

Share

దేశంలో పాదరక్షల రంగం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందనుందని, దాదాపు 10 రెట్ల అభివృద్ధి ఈ రంగంలో సాధించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రంగంలో పనిచేసే కార్మికుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పాదరక్షల పరిశ్రమ ప్రతినిధులను కోరారు. .ఈ రంగంలో భారత్‌కు అపారమైన సామర్థ్యం ఉందని, సమీప భవిష్యత్తులో ఉత్పత్తిని, ఎగుమతులను 10 రెట్లు పెంచుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగ్రా-లెదర్, ఫుట్‌వేర్ కాంపోనెంట్స్ టెక్నాలజీ ఫెయిర్‌ ను ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు, విదేశీ మారక ద్రవ్య ఆదాయానికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన పాదరక్షల రంగానికి సుమారు 7,000 చిన్న పరిశ్రమల యూనిట్లు అనుసంధానించ పడ్డాయన్నారు.  ఈ రంగంలో దాదాపు 40% మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, భవిష్యత్తులోనూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

భారత్ పాదరక్షల ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశమని, రానున్న కాలంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగగల సామర్థ్యం ఉందన్నారు. ప్రపంచంలోని చర్మశుద్ధిలో దాదాపు 3 బిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం భారత్ కలిగి ఉందని తెలిపారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులు పెంచడానికి ఉత్పత్తిదారులు నాణ్యతా ప్రమానాలను పాటించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యత ప్రమణాలు పాటించడం ద్వారా దేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్ లోని భారత ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్ చేయాలన్నారు. లెదర్ రహిత పాదరక్షల రంగంపై కూడా శ్రద్ధ పెట్టాలని పరిశ్రమల ప్రతినిధులను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కోరారు.

పాదరక్షల రంగానికి సంబంధించి అన్ని ప్రముఖ బ్రాండ్‌లు ముడి పదార్థాల కోసం భారత్‌పైనే ఆధారపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అధిక విలువ కలిగిన ప్రాజెక్టులతో భారతీయ బ్రాండ్లు ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన కోరారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ లు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్త మార్కెట్ ఉండేలా కొత్త డిజైన్‌లను రూపొందించడానికి ప్రయత్నించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో