AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visa Services: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి వీసా సర్వీసులు బంద్

ఖలిస్థానీ అంశం భారత్, కెనడాల మధ్య దౌత్రపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిమాణం చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. భారత్‌కు వచ్చేటటువంటి కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. అయితే పలు నిర్వహణ కారణాల వల్ల కెనడాలో విసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే మళ్లీ తదుపరి నోటీసులు వచ్చేంతవరకు.. ఈ ఆదేశాలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నాయి.

Visa Services: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి వీసా సర్వీసులు బంద్
Visa Services
Aravind B
|

Updated on: Sep 21, 2023 | 2:24 PM

Share

ఖలిస్థానీ అంశం భారత్, కెనడాల మధ్య దౌత్రపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిమాణం చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. భారత్‌కు వచ్చేటటువంటి కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. అయితే పలు నిర్వహణ కారణాల వల్ల కెనడాలో విసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే మళ్లీ తదుపరి నోటీసులు వచ్చేంతవరకు.. ఈ ఆదేశాలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వార్తలపై కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. కెనడియన్ల విసా దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించే ఓ ప్రైవేటు ఏజెన్సీ మాత్రం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్లో వెల్లడించింది. నిర్వహణ కారణాల వల్లే సెప్టెంబర్ 21 నుంచి వీసా సర్వీసులు సస్పెండ్ చేశారని.. తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

ఇదిలా ఉండగా.. గతంలో ఖలిస్థాని సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య భారత్‌కు సంబంధం ఉందనడానికి మా వద్ద విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని.. కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో వ్యాఖ్యానించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారీ తీసింది. భారత్, కెనడాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి సమయంలో.. వీసా సర్వీసులను భారత్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ అంశం మరింత చర్చనీయాంగా మారింది. అయితే హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన విషయంలో.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా.. అక్కడ ఉండే భారత్ దౌత్యవేత్తపై బహిష్యరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు.. ఆ తర్వాత మనదేశంలోని ఉన్నటువంటి కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. అంతేకాదు ఐదురోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ చెప్పింది.

మరోవైపు కెనడాలో హింసాత్మక ఘటనలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రవాస భారతీయులు.. అలాగే కెనడాకు పయనం అవ్వాలనుకునేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఓ అడ్వైజరిని కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా.. భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం రాజుకున్న వేళ.. మరో ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. మరో ఖలిస్థాని సానుభూతిపరుడు సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే హత్యకు గురైనట్లు సమాచారం. బుధవారం నాడు విన్నిపెగ్‌లో అతడు మృతి చెందినట్లు నిఘా వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే అతడి మరణంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ.. ఈ హత్య తామే చేసినట్లు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి