Republic Day 2022: 26 నవంబర్ 1949లోనే రాజ్యాంగం పూర్తయినా.. 26 జనవరి 1950నే ఎందుకు అమలు చేశారో తెలుసా?

బ్రిటీష్ వారు రూపొందించిన భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం 26 నవంబర్ 1949 లోనే తయారు చేశారు. కానీ, అది 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.

Republic Day 2022: 26 నవంబర్ 1949లోనే రాజ్యాంగం పూర్తయినా.. 26 జనవరి 1950నే ఎందుకు అమలు చేశారో తెలుసా?
Republic Day Parade
Follow us

|

Updated on: Jan 26, 2022 | 8:10 AM

Republic Day 2022: ఈరోజు దేశం మొత్తం 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. 1950లో ఇదే రోజున దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. బ్రిటీష్ వారు రూపొందించిన భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం 26 నవంబర్ 1949 లోనే తయారు చేశారు. దీనికి రాజ్యాంగ సభ ఆమోదం కూడా లభించింది. కానీ, అది 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.

1950 జనవరి 26న మాత్రమే రాజ్యాంగం ఎందుకు అమల్లోకి వచ్చింది? ఇలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. నిజానికి 1930 జనవరి 26న కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం లేదా దేశానికి సంపూర్ణ స్వరాజ్యం అనే నినాదాన్ని ఇచ్చింది. దీని జ్ఞాపకార్థం, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి 26 జనవరి 1950 వరకు వేచి ఉంది.

నిజానికి, 1929లో జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ ప్రమాణం చేశారు. ఆ సెషన్‌లో, 1930 జనవరి 26 నాటికి భారతదేశానికి సార్వభౌమాధికార హోదా ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు. ఆ తర్వాత 26 జనవరి 1930న మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ లేదా స్వాతంత్య్ర దినోత్సవాన్ని చేసుకున్నారు. దీని తరువాత, స్వాతంత్య్ర దినోత్సవం జనవరి 26న 1947 ఆగస్టు 15 వరకు అంటే తదుపరి 17 సంవత్సరాల పాటు నిర్వహించుకోలేదు. దేశ రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలు చేశారు. ఆ రోజునే గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు.

గణతంత్ర దినోత్సవం రోజున రాజేంద్రప్రసాద్ తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరిస్తున్నట్లు దేశ చివరి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి ప్రకటన చేశారు. భారతదేశం 26 జనవరి 1950న ఉదయం 10.18 గంటలకు గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 6 నిమిషాల తర్వాత 10:24 గంటలకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజేంద్రప్రసాద్ 21 గన్ సెల్యూట్‌తో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసంగాలు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా నిర్వహించుకుంటున్నారు.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దీనికి ఒక సంవత్సరం ముందు, అంటే 9 డిసెంబర్ 1946న, భారతదేశానికి స్వంత రాజ్యాంగం ఉండాలని నిర్ణయించారు. దీని కోసం రాజ్యాంగ సభ ఏర్పడింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సాగిన మారథాన్ సమావేశాల తరువాత, రాజ్యాంగం 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభచే రూపొందించి, ఆ తరువాత ఆమోదించారు. ఇది 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది.

2001: గుజరాత్‌లో భూకంపం వచ్చింది.. 2001లో ఇదే రోజున, భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో గుజరాత్‌లో బలమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో వేలాది మంది చనిపోయారు. గుజరాత్‌లోని భుజ్ నగరం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9 నుంచి 7.9గా నమోదైంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణ భారతదేశంపై కూడా ప్రభావం చూపింది. ఈ భూకంపం వల్ల వేలాది మంది చనిపోయారు. భవనాల శిథిలాల కింద వేలాది మంది సమాధి అయ్యారు. భుజ్‌లోని ఓ పాఠశాలలో 400 మందికి పైగా చిన్నారులను సమాధి చేశారు.

భారతదేశంలో, ప్రపంచంలోనూ జనవరి 26న జరిగిన ముఖ్యమైన సంఘటనలు:

2020: అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, 41, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.

2015 : ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మరణించారు.

2010 : మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై జరిగిన 2వ టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

2008 : శ్రీలంక తీవ్రవాద సంస్థ LTTE నాయకుడు మురళీధరన్‌కి UK కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది.

2004 : మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్‌కు నైట్ బిరుదు లభించిందని బ్రిటన్ రాణి ఎలిజబెత్ ప్రకటించింది.

1999 : మహిళలపై లైంగిక దోపిడీపై ప్రపంచ సదస్సు ఢాకాలో జరిగింది.

1972: అమర జవాన్ల జ్ఞాపకార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘అమర్ జవాన్ నేషనల్ మెమోరియల్’ స్థాపించారు.

1950: భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చింది. దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

Also Read: Republic Day 2022: కొవిడ్ ఎఫెక్ట్.. అన్ని చోట్ల ఉదయం 10గంటలకే.. గణతంత్ర వేడుకలపై మార్గదర్శకాలు..

Republic Day: గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏమిటి..? పూర్తి వివరాలు..!

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..