AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Covid-19: భారత్‌లో కరోనా తాండవం.. తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు..

India Coronavirus Updates: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం పదిరోజుల్లోనే మహమ్మారి కేసుల సంఖ్య ఏడు నెలల రికార్డును తుడిచిపెట్టేసింది. దేశంలో మొట్టమొదటి సారిగా

India Covid-19: భారత్‌లో కరోనా తాండవం.. తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు..
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: Jan 12, 2022 | 10:05 AM

Share

India Coronavirus Updates: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం పదిరోజుల్లోనే మహమ్మారి కేసుల సంఖ్య ఏడు నెలల రికార్డును తుడిచిపెట్టేసింది. దేశంలో మొట్టమొదటి సారిగా రోజూవారి కరోనా (Coronavirus) కేసులు లక్ష మార్క్‌ దాటి రెండు లక్షలకు చేరువలో నమోదయ్యాయి. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో.. అంతటా ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 442 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ (Covid-19 Updates)ను విడుదల చేసింది. నిన్నటితో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 26,657 (15.8%) కేసులు పెరిగాయి. నిన్న కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 9,55,319 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 60,405 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 4,868 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,60,70,510 కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,46,30,536 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,84,655 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 153.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా.. సోమవారం నుంచి ప్రికాషనరీ డోసు సైతం వేస్తున్నారు. ముందుగా 60ఏళ్లకు పైబడిన వారికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌‌కు ప్రికాషనరీ డోసు అందిస్తున్నారు.

Also Read:

Kodali Nani – Vangaveeti Radha: కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన ఇద్దరు నేతలు..

Sankranti Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 200లకు పైగా స్పెషల్ ట్రైన్స్..

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం