Uttar Pradesh: ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. గ్రామస్థులకు కట్టుకథలు చెబుతూ.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే మరో వారం రోజుల వరకు బాడీని పెట్టుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఓ ఫ్యామిలీ డెడ్ బాడీని ఏకంగా..

Uttar Pradesh: ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. గ్రామస్థులకు కట్టుకథలు చెబుతూ.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
child illness
Follow us

|

Updated on: Sep 24, 2022 | 8:28 AM

ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే మరో వారం రోజుల వరకు బాడీని పెట్టుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఓ ఫ్యామిలీ డెడ్ బాడీని ఏకంగా సంవత్సరంన్నర రోజులు ఇంట్లోనే ఉంచుకుంది. కనీసం మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. దీంతో డెడ్ బాడీ కుళ్లిపోయింది. ఎంతగా అంటే.. ఎముకల్లోని మజ్జ కూడా ఇంకిపోయేంతగా.. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన అహ్మదాబాద్​లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ 2021 ఏప్రిల్​ 22న మృతి చెందాడు. అయితే కుటుంబసభ్యులు అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. విమలేశ్ కనిపించకపోవడంతో గ్రామస్థులు ఆరా తీశారు. అయితే విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరినీ నమ్మించారు.

కాగా.. విమలేశ్​భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్​బ్యాంకు​లో మేనేజర్​గా పని చేస్తోంది. పెన్షన్ కు అప్లై చేసుకునేందుకు విమలేశ్​మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విమలేశ్ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్​లో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెడ్ బాడీని పరీక్షించిన వైద్యులు.. విమలేశ్​మృతదేహం పూర్తిగా చెడిపోయిందని గుర్తించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా మృతదేహాన్ని ఎలా ఇంట్లో ఉంచుకుంటారని మండిపడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్