Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RJD MLA: చాయ్ ఇచ్చిన సిబ్బందిపై హత్యాయత్నం కేసు పెట్టిన ఎమ్మెల్యే.. అసలు విషయం తెలిస్తే షాక్!

బీహార్‌లోని హాజీపూర్‌లో ఆర్జేడీ ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ రౌషన్ టీలో పురుగు కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అధికారులపై హత్యయత్నం కేసు నమోదు చేశారు.

RJD MLA: చాయ్ ఇచ్చిన సిబ్బందిపై హత్యాయత్నం కేసు పెట్టిన ఎమ్మెల్యే.. అసలు విషయం తెలిస్తే షాక్!
Rjd Mla On Tea
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 13, 2021 | 10:47 AM

Bihar RJD MLA Dr Mukesh Roshan: బీహార్‌లోని హాజీపూర్‌లో ఆర్జేడీ ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ రౌషన్ టీలో పురుగు కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అధికారులపై హత్యయత్నం కేసు నమోదు చేశారు. స్థానిక కథనం ప్రకారంఆర్జేడీ ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ రౌషన్ హాజీపూర్‌ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో బస చేశారు. అయితే ఆదివారం సాయంత్రం, ఉద్యోగులు అతనికి తాగడానికి టీ ఇచ్చారు. ఈ క్రమంలో టీ కప్పుపై ఎమ్మెల్యే కన్ను పడగా.. అందులోని పురుగులను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్క్యూట్ హౌస్‌లో ఉన్న ఉద్యోగులను ఎమ్మెల్యే మందలించారు. టీలో పురుగు వేసి చంపేందుకు కుట్ర పన్నడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆగ్రహించిన ఎమ్మెల్యే డీఎంతోపాటు ఇతర అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించడంతో పాటు వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశారు. అంతటితో ఆగని ఎమ్మెల్యే కోపోద్రిక్తుడై సర్క్యూట్ హౌస్ ఉద్యోగులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ అనంతరం ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందటే, పాట్నా నుండి తన ప్రాంతానికి వెళుతున్నప్పుడు, మహువా అసెంబ్లీకి చెందిన RJD ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ రోషన్ ఆదివారం సాయంత్రం హాజీపూర్ పాశ్వాన్ చౌక్ వద్ద ఉన్న సర్క్యూట్ హౌస్‌లో బస చేశారు. అక్కడ ఉద్యోగులు ఆయనకు టీతో స్వాగతం పలికారు. అదే సమయంలో టీ తాగుతుండగా ఓ వింత అనుభవం ఎదురైంది. మొదట్లో టీ ఆకులు ఉంటాయని అనుకున్నా టీని చూడగానే కప్పు అడుగున పదుల సంఖ్యలో పెద్ద పెద్ద కీటకాలు కనిపించాయి. ప్లేట్‌లో టీ పోసి టీ కప్పులన్నీ వరుసగా చూసే సరికి కప్పులన్నింటిలో క్రిములు కనిపించాయి. ఇది చూసిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. సర్క్యూట్ హౌస్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందని ఎమ్మెల్యే మండిపడ్డారు.

ఇదిలావుంటే, సదర్ పోలీస్ స్టేషన్‌లోని సర్క్యూట్ హౌస్ ఉద్యోగులపై RJD ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో పాటు వైశాలి డీఎం, ఎస్‌డీఓలకు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్‌ మాట్లాడుతూ.. బీహార్‌లోని సర్క్యూట్‌ హౌస్‌లన్నీ ముంబైకి చెందిన ఎన్‌ కుమార్‌ అసోసియేట్‌ ఇంటర్నేషనల్‌కు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఇచ్చామని తెలిపారు. ఈ కంపెనీ సమయంలో ఇక్కడి ఆహార పదార్థాల్లో ఇంత అజాగ్రత్త పడుతున్నారు. ఔట్‌సోర్సింగ్‌కు ముందు ఇక్కడ పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. ప్రస్తుతం నిర్వహణ సరిగా లేదని ఆరోపించారు. సర్క్యూట్ హౌస్‌కు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా ఇలాంటి నిర్లక్ష్యం సహించేది లేదన్నారు.

Read Also…  Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్.. ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులకు ఉచిత కార్పొరేట్ వైద్యం..!