Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ గుడ్న్యూస్.. ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులకు ఉచిత కార్పొరేట్ వైద్యం..!
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది యోగి సర్కార్.. రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Uttar Pradesh CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది యోగి సర్కార్.. రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 16 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగులకు నగదు రహిత చికిత్స సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, కుటుంబంతో సహా ప్రతి రాష్ట్ర ఉద్యోగికి ప్రతి సంవత్సరం రూ.5 లక్షల పరిమితి వరకు నగదు రహిత చికిత్స సౌకర్యం కల్పించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కార్పొరేట్ తరహాలో నగదు రహిత చికిత్స సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం ఎంప్యానెల్ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో వారు ఈ చికిత్స సౌకర్యాన్ని పొందవచ్చు.
ఇందుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనను సిద్ధం చేయగా, ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో ఎన్నికల ముందు ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు తెలిపాయి. అదే సమయంలో శాసనసభ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని సభలో ప్రకటించవచ్చని కూడా చెబుతున్నారు. ఇది యోగి ప్రభుత్వం పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికలలో నిమగ్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సులభతరం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.
వాస్తవానికి నగదు రహిత వైద్యం సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ఉద్యోగులు గత ఐదేళ్లుగా కోరుతున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం ఉద్యోగులు ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారు. కానీ దీని కోసం వారు సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు కార్పొరేట్ తరహాలో నగదు రహిత సౌకర్యాన్ని పొందాలి. తద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యం చేయడం సులువు అవుతుంది. చాలాసార్లు నిధులు రాకపోవడంతో ఉద్యోగులకు సరైన వైద్యం అందడం లేదని, మెడికల్ రీయింబర్స్మెంట్పై నకిలీ కేసులు పెట్టడమే కాకుండా ఈ విధానంలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఉద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం సౌకర్యం గత ఎస్పీ ప్రభుత్వ హయాంలో జరిగినా.. కానీ అప్పటి అఖిలేష్ ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతో ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
నిజానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు నగదు రహిత చికిత్స సౌకర్యం కల్పించడం లేదు. అదే సమయంలో కేంద్రం వైఖరిని చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అమలు చేయలేదు. అదే సమయంలో ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయుష్మాన్ యోజన మార్గం చూపిందన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రతిపాదన ప్రకారం ఒక్కో ఉద్యోగి నుంచి ఏడాదికి రూ.1,400 ప్రీమియం వసూలు చేసి ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అదే సమయంలో, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సచిజ్ (స్టేట్ ఏజెన్సీ ఫర్ కాంప్రహెన్సివ్ హెల్త్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్) ద్వారా ఈ సౌకర్యాన్ని పొందుతారు. ఈ పథకం కింద, ప్రతి రాష్ట్ర ఉద్యోగితో పాటు అతని కుటుంబ సభ్యుల కార్డు తయారు చేయడం జరుగుతుంది. దీని ఆధారంగా అతను ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స సౌకర్యాన్ని ఉచితంగా పొందుతారు.
Read Also… Telangana: బెబ్బులి వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కుక్కలు.. అటు రావాలంటే హడల్..