AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు అలర్ట్..2027 నాటికి ఈ కార్లపై పూర్తి నిషేధం..? కేంద్ర ప్రభుత్వానిదే ప్రధాన నిర్ణయం..

ఈ సలహా కమిటీకి పెట్రోలియం మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ చైర్మన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీల అధికారులు, చమురు మంత్రిత్వ శాఖ అధికారి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో ఓఎన్‌జీసీ మాజీ చైర్మన్ సుభాష్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించారు.

వాహనదారులకు అలర్ట్..2027 నాటికి ఈ కార్లపై పూర్తి నిషేధం..? కేంద్ర ప్రభుత్వానిదే ప్రధాన నిర్ణయం..
Vehicles
Jyothi Gadda
|

Updated on: May 09, 2023 | 7:34 AM

Share

ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మన దేశంలోనే చాలా నగరాలు ఉన్నాయి. గత సంవత్సరం, ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల వార్షిక జాబితాలో 39 భారతీయ నగరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాను డీజిల్‌తో నడిచే కార్లపై పూర్తి నిషేధం విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన పరివర్తన సలహా కమిటీ, ఇటీవలి నివేదికలో మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని నగరాల్లో డీజిల్‌తో నడిచే 4వీలర్‌ వాహనాలను దశలవారీగా తొలగించాలని సిఫార్సు చేసింది.

ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా 2035 నాటికి జాతీయ ఇంధనంలో గ్రిడ్ పవర్ వాటాను 40 శాతానికి రెట్టింపు చేయాలని పిలుపునిచ్చింది. పెట్రోలియం, బొగ్గు, విద్యుత్, పునరుత్పాదక రంగాలను పర్యవేక్షించేందుకు మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సలహా సంఘం సిఫార్సు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఎనర్జీ ట్రాన్సిషన్ బోర్డ్ కూడా ఈ వ్యవస్థ అన్ని వాటాదారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా హరిత ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రజల్ని మళ్లించేందుకు కృషి చేస్తుందని విశ్వసిస్తోంది.

డెలివరీ వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లను 2024 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే తెరిచినట్లయితే, రాబోయే 10 సంవత్సరాలలో 75 శాతం వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు అవుతాయని, భవిష్యత్తులో ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని ప్యానెల్ సూచించింది. ఈ సలహా కమిటీకి పెట్రోలియం మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ చైర్మన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీల అధికారులు, చమురు మంత్రిత్వ శాఖ అధికారి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో ఓఎన్‌జీసీ మాజీ చైర్మన్ సుభాష్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి

తాజా ప్రపంచ వాయు నాణ్యత నివేదికలో, గత ఏడాది ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. అంటే భారతదేశంలో వాయు కాలుష్యం WHO సురక్షిత పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ. దేశంలోని అత్యంత దారుణమైన వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి బయో-సిఎన్‌జి మిథనాల్, విద్యుత్, బయో-డీజిల్, ఎల్‌ఎన్‌జి, హెచ్-సిఎన్‌జి, హైడ్రోజన్ ఇంధన కణాల వంటి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గమనించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..