Viral: అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. ఇలా ఎందుకు కూర్చున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవేయండి

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమే. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం, కలిసిపోయే తత్వం ఉండటం సహజమే. అయితే తమ కళాశాలలో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చోకుండా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్...

Viral: అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. ఇలా ఎందుకు కూర్చున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవేయండి
Girls Protset
Follow us

|

Updated on: Jul 22, 2022 | 11:45 AM

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమే. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం, కలిసిపోయే తత్వం ఉండటం సహజమే. అయితే తమ కళాశాలలో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చోకుండా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తిరువనంతపురం (Thiruvananthapuram) వింత చర్యకు పాల్పడింది. ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన కొంత మంది విద్యార్ధులు తాము రోజూ కూర్చునే బెంచ్ వద్దకు వెళ్లారు. అక్కడ స్టీలు బెంచ్‌ను మూడు సింగిల్‌ సీట్లను తొలగించి, దూరం దూరంగా ఉండటాన్ని గమనించారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పని అని వారు గ్రహించారు. వెంటనే వారు నిరసన తెలిపేందుకు రెడీ అయ్యారు. పక్కపక్కన కూర్చోకుండా చేయడం వల్ల తమలో లింగ బేధం భావన వస్తుందని, ఇది తమ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఆగ్రహంతో ఊగిపోయారు. అబ్బాయిలు బెంచీలపై కూర్చోగా.. అమ్మాయిలు వారి ఒళ్లో కూర్చుని వినూత్న నిరసన తెలిపారు. ఇలాంటి తక్కువ స్థాయి ఆలోచనలు తమ స్నేహాన్ని ఆపలేవని మండిపడ్డారు. ఒకరి పక్కన కూర్చోలేం కానీ కచ్చితంగా ఒడిలో కూర్చోగలమని స్పష్టం చేశారు.

ఈ అంశంపై కళాశాల యాజమాన్యం స్పందించింది. క్యాంపస్ లో విద్యార్థినులను వేధిస్తున్న సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని నివారించేందుకు సీటింగ్ లో మార్పులు చేశామని వెల్లడించారు. అంతే కాకుండా బయటి వారు కూడా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, వారి చర్యలు తమకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. కాగా తిరువనంతపురం నగర మేయర్ ఆర్య ఎస్ రాజేంద్రన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బెంచీని మూడు సీట్లకు కుదించిన విధానం అనుచితమని అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడంపై నిషేధం లేదని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థుల నిరసనను అభినందిస్తూ, స్పందించే తరం భవిష్యత్తుకు ఆశాజనకంగా ఉందని చెప్పారు. ఈ విషయంలో స్థానిక అధికారులు విద్యార్థుల పక్షాన ఉన్నారని పేర్కొన్నారు. బస్ వెయిటింగ్ షెడ్ శిథిలావస్థకు చేరుకుందని, అందుకోసం అక్కడ మున్సిపాలిటీ ద్వారా ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వెయిటింగ్ షెడ్ నిర్మిస్తామని ఆమె తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..