AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girl Argues With Police : వాహనాల తనిఖీ సమయంలో పోలీసులతో ఓ యువతి వాగ్వాదం.. చేయి చేసుకున్న మహిళా పోలీసు

ఓ మహిళా పోలీసు ద్వి చక్రవాహన తనిఖీ సమయంలో సహనం కోల్పోయి ఓ యువతి పై చేయి చేసుకుంది.. తన అధికారాన్ని దుర్వినియోగ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన కర్ణాటక లోని మాండ్యా లో చోటు చేసుకుంది..

Girl Argues With Police : వాహనాల తనిఖీ సమయంలో పోలీసులతో ఓ యువతి వాగ్వాదం.. చేయి చేసుకున్న మహిళా పోలీసు
Surya Kala
| Edited By: |

Updated on: Mar 11, 2021 | 7:27 PM

Share

Girl Argues With Police :  ఓ మహిళా పోలీసు ద్వి చక్రవాహన తనిఖీ సమయంలో సహనం కోల్పోయి ఓ యువతి పై చేయి చేసుకుంది.. తన అధికారాన్ని దుర్వినియోగ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన కర్ణాటక లోని మాండ్యా లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే.. ద్విచక్ర వాహనాల తనిఖీ సమయంలో ఓ యువతి తనతో వాగ్వాదానికి దిగిందంటూ ఓ యువతి పై పీఎస్‌ఐ సవితగౌడ పాటిల్ దాడి చేశారు. ఈ సంఘటన మాండ్యలోని బేసగరహల్లి రామన్న సర్కిల్‌లో జరిగింది. యువతి పై చేయి చేసుకోవడాన్ని తప్పు పడుతూ సమీపంలోని ఓ వృద్ధురాలు కూడా సవితగౌడ్ ను ప్రశ్నించారు. సిటిజన్ల పట్ల మీ ప్రవర్తన సరికాదంటూ అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు సవితగౌడ పాటిల్ యువతి పై చేయి చేసుకోవడాన్ని ఖండిస్తున్నారు.

ఒక యువతి తన స్కూటీ ని ఢీ కొట్టిన సందర్భంలో మహిళా పీఎస్‌ఐ సవితగౌడ పాటిల్ ఆ యువతిని పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించింది. అయితే అకస్మాత్తుగా యువతి, మహిళా పీఎస్‌ఐ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యువతి ఏయ్ అని అనేసరికి సవితా పాటిల్ ఆయువతి చెంపపై కొట్టింది. ఇద్దరు ఒకరినొకరు దూషించనుకున్నారు.

ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం మాండ్యలోని రహదారిలో జరిగింది. హెల్మెట్ ధరించలేదని యువతికి పోలీసులు రూ .500 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. అప్పుడు యువతి తన దగ్గర డబ్బులు లేవు.. ఫోన్ పే కూడా లేదని పోలీసులకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జరిమానాను నగదు రూపంలో చెల్లించమని చెప్పి ఆ యువతి బైక్ ను పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆ యువతి తాను జరిమానా చెల్లిస్తాను కంగారు పడకండి ని కోరినట్లు తెలుస్తోంది. ఈ యువతి పోలీసులతో మాట్లాడింది. అనంతరం యువతి పిఎస్‌ఐ సవితా గౌడను చెంపదెబ్బ కొట్టింది. అప్పుడు ద్విచక్ర వాహనం, యువతిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే, యువతిపై కేసు నమోదు చేస్తే భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. అయితే ఆ యువతి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో పాటు హెల్మెట్ ధరించనందుకు పోలీసులు ఆ యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ద్విచక్ర వాహనాల తనిఖీ సమయంలో ఓ యువతి తనతో వాగ్వాదానికి దిగిందంటూ ఓ యువతి పై పీఎస్‌ఐ సవితగౌడ పాటిల్ దాడి చేశారు. ఈ సంఘటన మాండ్యలోని బేసగరహల్లి రామన్న సర్కిల్‌లో జరిగింది. యువతి పై చేయి చేసుకోవడాన్ని తప్పు పడుతూ సమీపంలోని ఓ వృద్ధురాలు కూడా సవితగౌడ్ ను ప్రశ్నించారు. సిటిజన్ల పట్ల మీ ప్రవర్తన సరికాదంటూ అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు సవితగౌడ పాటిల్ యువతి పై చేయి చేసుకోవడాన్ని ఖండిస్తున్నారు.

ఒక యువతి తన స్కూటీ ని ఢీ కొట్టిన సందర్భంలో మహిళా పీఎస్‌ఐ సవితగౌడ పాటిల్ ఆ యువతిని పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించింది. అయితే అకస్మాత్తుగా యువతి, మహిళా పీఎస్‌ఐ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యువతి ఏయ్ అని అనేసరికి సవితా పాటిల్ ఆయువతి చెంపపై కొట్టింది. ఇద్దరు ఒకరినొకరు దూషించనుకున్నారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం మాండ్యలోని రహదారిలో జరిగింది. హెల్మెట్ ధరించలేదని యువతికి పోలీసులు రూ .500 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. అప్పుడు యువతి తన దగ్గర డబ్బులు లేవు.. ఫోన్ పే కూడా లేదని పోలీసులకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జరిమానాను నగదు రూపంలో చెల్లించమని చెప్పి ఆ యువతి బైక్ ను పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆ యువతి తాను జరిమానా చెల్లిస్తాను కంగారు పడకండి ని కోరినట్లు తెలుస్తోంది.

ఈ యువతి పోలీసులతో మాట్లాడింది. అనంతరం యువతి పిఎస్‌ఐ సవితా గౌడను చెంపదెబ్బ కొట్టింది. అప్పుడు ద్విచక్ర వాహనం, యువతిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే, యువతిపై కేసు నమోదు చేస్తే భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. అయితే ఆ యువతి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో పాటు హెల్మెట్ ధరించనందుకు పోలీసులు ఆ యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also Read: మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు.. ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్‌

 ఆ అపురూప ఘట్టానికి సరిగ్గా పదేళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జైతెలంగాణ’ ఆవాజ్‌

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం